English | Telugu

పవర్ స్టార్ 'జల్సా'కి 15 ఏళ్ళు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా 'జల్సా'. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం 2008, ఏప్రిల్ 2న విడుదలైంది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలోని సాంగ్స్, డైలాగ్స్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 'ఖుషి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొన్న పవన్.. 'జల్సా'తోనే మళ్ళీ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం విడుదలై నేటికి 15 ఏళ్ళు పూర్తయింది.

కథలో నక్సలిజం నేపథ్యం ఉన్నప్పటికీ దానిని ఇంత వినోదభరితంగా చెప్పడం త్రివిక్రమ్ కే సాధ్యమవుతుందేమో. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఎమోషనల్ సన్నివేశాలు కూడా అదే స్థాయిలో మెప్పించాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో "కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా" అంటూ పవన్ చెప్పే డైలాగ్ కట్టిపడేసింది. పవన్ నక్సలైట్ గా మారడానికి దారితీసిన పరిస్థితులు కంటతడి పెట్టించాయి. ఇక పవన్-ఇలియానా మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే పవన్-బ్రహ్మానందం, ఇలియానా-సునీల్ నడుమ కామెడీ సన్నివేశాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటికీ ఆ సన్నివేశాలు అలరిస్తాయి. "యుద్ధంలో గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం" అంటూ మాటల తూటాలు పేల్చిన త్రివిక్రమ్ ఈ చిత్రంతో మరోసారి తన కలం బలం చూపించారు. ఇక ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

'జల్సా' విజయంలో దేవిశ్రీప్రసాద్ సంగీతం కీలక పాత్ర పోషించింది. 'జల్సా టైటిల్ సాంగ్', 'మై హార్ట్ ఈజ్ బీటింగ్', 'ఛలోరే ఛలోరే చల్', 'గాల్లో తేలినట్టుందే' ఇలా ఈ చిత్రంలోని పాటలన్నీ అప్పట్లో ఒక ఊపు ఊపాయి. ఈ చిత్రంలో కమలినీ ముఖర్జీ, పార్వతీ మెల్టన్, ముకేష్ రిషి, ప్రకాశ్ రాజ్, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం, సునీల్, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శివాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకి డీఓపీలుగా కే.వి. గుహన్, రసూల్ ఎల్లోర్, ఎడిటర్ గా ఎ.శ్రీకర్ ప్రసాద్ వ్యవహరించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.