English | Telugu

'దసరా' బాక్సాఫీస్.. రెండు రోజుల్లో 60 శాతం రికవరీ!

నాని హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'దసరా' రెండో రోజు కలెక్షన్లు నెమ్మదించాయి. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 21 కోట్ల షేర్‌తో సంచలనం సృష్టించిన ఈ సినిమా రెండో రోజు రూ. 8 కోట్ల షేర్ సాధించింది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. అయితే రెండు రోజుల్లో రూ. 29 కోట్ల షేర్ రాబట్టడం కూడా చాలా పెద్ద విషయమే.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 14.22 కోట్ల షేర్ రాబట్టిన 'దసరా' మూవీ, రెండో రోజు రూ. 5.86 కోట్ల షేర్ వసూలు చేసింది. వెరసి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు రూ. 20 కోట్ల మార్కును దాటాయి. తెలంగాణలో రెండో రోజు శుక్రవారం రూ. 3.48 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.72 కోట్లు, రాయలసీమలో రూ. 66 లక్షలు వసూలయ్యాయి. రెండు రోజులను లెక్కలోకి తీసుకుంటే దసరా సినిమా తెలంగాణలో రూ. 10.26 కోట్లు, ఆంధ్రాలో రూ. 6.80 కోట్లు, రాయలసీమలో 3.02 కోట్ల షేర్ వసూలు చేసింది.

తెలుగు తప్ప మిగతా భాషల్లో 'దసరా' ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోందని చెప్పాలి. అయితే ఓవర్సీస్‌లో మాత్రం సినిమా అదరగొడుతోంది. అక్కడ రెండు రోజుల్లో 5.6 కోట్ల షేర్ రాబట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లో కలిపి రూ. 29.08 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ప్రి బిజినెస్ విలువ సుమారు రూ. 48 కోట్లు. అంటే రెండు రోజుల్లోనే 60 శాతంపైగా రికవరీ అయ్యింది. మౌత్ టాక్ బాగా ఉండటం, శని, ఆది వారాల్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉండటంతో వీకెండ్ నాటికి బ్రేకీవెన్ సాధించవచ్చనే నమ్మకం వ్యక్తమవుతోంది.

కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కథకు కేంద్రబిందువు అయిన వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ నటించగా, దీక్షిత్ శెట్టి, షైన్ టాం చాకో, సముద్రకని, సాయికుమార్ కీలక పాత్రలు చేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.