English | Telugu

అల్లు అర్జున్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. అసలు సౌండ్ లేదేంటి..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అంత ప్రతిష్టాత్మక అవార్డు వస్తే.. మీడియా, సోషల్ మీడియా మారుమోగిపోవాలి కదా. అలాంటిది పెద్దగా హడావుడి లేదేంటని ఆశ్చర్యపోతున్నారా?. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. (Dadasaheb Phalke)

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద అత్యున్నత సినీ పురస్కారాన్ని భారత ప్రభుత్వం అందిస్తున్నది. తెలుగులోఎల్.వి.ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, కె.విశ్వనాథ్ వంటి దిగ్గజాలు ఈ అవార్డును అందుకున్నారు. తెలుగు నుండి చివరగా 2016 లో విశ్వనాథ్ కి ఈ గౌరవం దక్కింది. ఇక ఈ ఏడాదికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మలయాళ నటుడు మోహన్ లాల్ ని వరించింది. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ పేరు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును భారత ప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయ అవార్డులతో పాటు అందిస్తుంది. సినీ రంగానికి సేవలందించిన దిగ్గజాలకు ఈ అవార్డును ఇస్తుంటారు. అయితే దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద ఓ ప్రైవేట్ సంస్థ కూడా అవార్డులు ఇస్తోంది. 'దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్' పేరుతో ప్రతి ఏడాది వేడుక నిర్వహించి.. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అల్లు అర్జున్ గెలుచుకున్నాడు.

Also Read: 'బాహుబలి: ది ఎపిక్' కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి!

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ రెండూ ఒకటే అనుకొని కొందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రభుత్వం ఇస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ అనేది ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కి వచ్చింది ప్రైవేట్ అవార్డు.

భవిష్యత్ లో అల్లు అర్జున్ భారత ప్రభుత్వం నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నా ఆశ్చర్యంలేదు. ఇప్పటికే పుష్ప సినిమాకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకొని, ఈ ఫీట్ సాధించిన మొదటి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు. భవిష్యత్ లో మరిన్ని సంచలనాలు సృష్టించి, ప్రభుత్వం నుండి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకునే స్థాయికి ఎదుగుతాడేమో చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.