English | Telugu

'గ‌బ్బ‌ర్ సింగ్ 2' ఆగిపోయింది


గ‌బ్బ‌ర్ సింగ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిపోయి.... బ్లాక్‌బ్ల‌స్ట‌ర్ ఖాతాలో చేరిపోయింది. ఆ త‌ర‌వాత ఈ సినిమాకి సీక్వెల్ చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. దానికితోడు హిందీలోనూ ద‌బాంగ్ 2 అంటూ స‌ల్మాన్ భాయ్ హిట్ కొట్టాడు. ఆస్ఫూర్తితో గ‌బ్బ‌ర్ సింగ్ 2కి ముహూర్తం ఖ‌రారై... ద‌ర్శ‌కుడిగా సంప‌త్‌నంది గ‌బ్బ‌ర్ సింగ్ 2 స్ర్కిప్టుని పూర్తిస్థాయిలో సిద్ధం చేసి ప‌వ‌న్ కోసం ఎదురుచూశాడు. తీరా చూస్తే... ప‌వ‌న్ సంప‌త్‌కి హ్యాండిచ్చి ఇంటికి పంపించేశాడు. ఆ త‌ర‌వాత బాబిని రంగంలోకి దింపాడు. గ‌బ్బ‌ర్ సింగ్ 2 క‌థ‌లోనే కొన్ని మార్పులు చేర్పులూ చేశాడు. అయితే ఇది కూడా వ‌వ‌న్‌కి న‌చ్చ‌లేదు.

దాంతో ఆ స్ర్కిప్టు పూర్తిగా ప‌క్క‌న ప‌డేసి... కొత్త క‌థ రాయించాడు. గ‌బ్బ‌ర్ సింగ్ 2 క‌థ‌ని వాడుకోనప్పుడు ఆ టైటిల్ ఎందుకు అనుకొన్నాడేమో... దాన్నీ మార్చేసి స‌ర్దార్ అని నామ‌క‌ర‌ణం చేశాడు. ప‌వ‌న్ ఎత్తుగ‌డ వెనుక రెండు కార‌ణాలున్నాయి. గ‌బ్బ‌ర్ సింగ్ 2 అన‌గానే అభిమానుల్లో అంచ‌నాలు పెరిగిపోతాయి. గ‌బ్బ‌ర్ సింగ్‌తో సినిమాని పోల్చి చూసుకొంటారు. వాటిని అందుకోవ‌డం ఎట్టిప‌రిస్థితుల్లోనూ క‌ష్ట‌మే. అందుకే అంచ‌నాలు త‌గ్గించ‌డానికి ప‌వ‌న్ టైటిల్‌లో మార్పు చేశాడు. రెండోది గ‌బ్బ‌ర్ సింగ్ 2 అనే టైటిల్ పెడితే.. టైటిల్ కోసమే క‌నీసం కోటి రూపాయ‌లు వెచ్చించాలి. ఎందుకంటే ఈ టైటిల్ షోలే నిర్మాత‌ల ద‌గ్గ‌ర ఉంది. ఆ హ‌క్కుల్ని తీసుకొనే గ‌బ్బ‌ర్ సింగ్ అనే టైటిల్ పెట్టారు అప్ప‌ట్లో. ఇప్పుడు మ‌ళ్లీ ఆ టైటిల్ వాడుకోవాలంటే మ‌ళ్లీ మ‌రో కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేయాలి. దాంతో పాటు సంప‌త్ నంది రాసిన సీన్లు వాడుకొంటున్నార‌న్న అప‌వాదు రాకుండా... పూర్తిగా ఆక‌థ‌నీ ఆ పేరునీ లేకుండా చేసేసి త‌న తెలివితేట‌ల్ని చూపించాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.