English | Telugu

కోలీవుడ్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్ మూవీ

మెగాస్టార్ చిరంజీవి భోళా శంక‌ర్ సినిమా డిజాస్ట‌ర్ త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో ఆయ‌న మోకాలి శ‌స్త్ర చికిత్స కూడా చేసుకున్నారు. ఇప్పుడు అంతా సెట్ అనుకున్న త‌ర్వాత నెక్ట్స్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. నిజానికి మెగా 157గా వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో చేయాల‌నుకున్న సినిమాను మెగా 156గా ముందుగా షూటింగ్‌ను స్టార్ట్ చేసేస్తున్నారు. సోషియో ఫాంట‌సీ కాన్సెప్ట్‌తో సినిమా స్టార్ట్ కానుంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మూవీ అవ‌గానే చిరంజీవి నెక్ట్స్ మూవీని వెంట‌నే స్టార్ట్ చేయ‌టానికి రెడీ అయిపోతున్నార‌ని సినీ స‌ర్కిల్స్ స‌మాచారం.

సినీ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు త‌మిళ ద‌ర్శ‌కుడు పి.ఎస్‌.మిత్ర‌న్‌తో క‌లిసి చిరంజీవి ఓ సినిమా చేయ‌బోతున్నార‌ట‌. మెసేజ్ చిత్రాల‌ను క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో చెప్ప‌టంలో మిత్ర‌న్‌కు ఓ ప్ర‌త్యేక‌మైన స్టైల్ ఉంది. ఆయ‌న డైరెక్ట్ చేసిన అభిమన్యుడు, స‌ర్దార్ చిత్రాలు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్‌. ఇప్పుడు ఈ డైరెక్ట‌ర్ అభిమ‌న్యుడు త‌ర్వాత విశాల్‌తో మ‌రో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయ‌బోతున్నార‌ట‌. రీసెంట్‌గా చిరంజీవిని క‌లిసి ఆయ‌న క‌థ నెరేట్ చేయ‌గా ఆయ‌న‌కు చాలా బాగా న‌చ్చింది. పూర్తి స్క్రిప్ట్ చేయ‌మ‌ని కూడా చెప్పేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

చిరంజీవి ఇమేజ్‌కు త‌గ్గ‌ట్లు మెసేజ్‌, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ కాంబినేష‌న్‌లో ఈ సినిమాను మిత్ర‌న్ తెర‌కెక్కించ‌బోతున్నారు. చిరంజీవి కుమార్తె సుష్మిత‌తో పాటు ఓ త‌మిళ నిర్మాణ సంస్థ క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ కాబోతున్నాయి. మ‌రో వైపు మెగా 157 సినిమా సోషియో ఫాంట‌సీ బ్యాక్ డ్రాప్‌తో తెర‌కెక్క‌నుంది. బింబిసార వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత వ‌శిష్ట ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.