English | Telugu

పవన్ కళ్యాణ్ నివాళులు...చిరు కంటతడి

రోడ్డుప్రమాదంలో మరణించిన సినీ నటుడు నందమూరి హరికృష్ణ పెద్దకుమారుడు నందమూరి జానకీరామ్ మృతదేహానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిరంజీవిలు నివాళులు అర్పించారు. ఆదివారం ఆయన హరికృష్ణ నివాసం వద్దకు వచ్చిన చిరు, పవన్ నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ కుటుంబాన్ని ఓదార్చారు. జానకిరాం భౌతికకాయాన్ని చూసి చిరంజీవి కంటతడిపెట్టారు. జానకిరామ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... వాహనాదారులు, యువత ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.వాహనాలు నడుతున్నప్పుడు హెల్మెట్, సీటు బెల్టు వంటి నియమాలను తప్పక పాటించాలని తెలిపారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.