English | Telugu

ఛార్మి డ‌బుల్ ధ‌మాకా

గ్లామ‌ర్ రోల్స్ అంటే గుర్తొచ్చే హీరోయిన్స్‌లో ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి ఒక‌రు. టాప్ హీరోల ప‌క్క‌న గ్లామ‌ర‌సాన్ని ఒలికిస్తూ ఆడిపాడినా.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో గ్లామ‌ర్‌గా క‌నిపిస్తూనే పెర్‌ఫార్మెన్స్‌ని చూపెట్టినా ఆమెని స‌క్సెస్‌లు బాగానే వ‌రించాయి. ఇదిలా ఉంటే.. ఈ అందాల తార కేవ‌లం వారం గ్యాప్‌లో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో సిల్వ‌ర్ స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నుంది. ఈ నెల 12న పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన జ్యోతిల‌క్ష్మీతో ప‌ల‌క‌రించ‌నున్న ఈ సుంద‌రి.. జూన్ మూడో వారంలో మంత్ర 2తో ఆడియ‌న్స్ ముందుకు రానుంది. ఓ హీరోయిన్ న‌టించిన రెండు సినిమాలు వారం రోజుల గ్యాప్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డంలో పెద్ద విశేష‌మేమిలేదు కానీ.. ఆ రెండు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కావ‌డంతోనే ఛార్మి వార్త‌ల్లో నిలుస్తోంది. ఆల్ ది బెస్ట్ ఛార్మి!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.