English | Telugu

చందమామ హిట్టయితే సీక్వెల్ తీస్తారంట..!

ఎనిమిది విభిన్న కథలతో తెరకెక్కిన "చందమామ కథలు" చిత్రం ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఆడియో విడుదల చేసారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ..."ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. మిక్కీ జే మేయర్ మంచి పాటలను అందించాడు. మేము సరికొత్తగా విడుదల చేసిన డిజిటల్ ఆన్ లైన్ ఫార్మట్ ఆడియో సక్సెస్ అయ్యింది. ఈ సినిమా సక్సెస్ ను బట్టి ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకే ఈ సినిమాకు వాల్యుం 1 అని పెట్టాము" అని అన్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చాణక్య బూనేటి నిర్మించారు. ఇందులో నరేష్, ఆమని, మంచు లక్ష్మీ, కృష్ణుడు, చైతన్య కృష్ణ, రిచా పనాయ్, కిషోర్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .