English | Telugu

వీబీ రాజేంద్రప్రసాద్‌ మృతికి చలనచిత్ర పరిశ్రమ సంతాపం

ప్రముఖ నిర్మాత, దర్శకుడు వీబీ రాజేంద్రప్రసాద్‌ మృతి పట్ల తెలుగు చిత్రపరిశ్రమ సంతాపం ప్రకటించింది. సినీ ప్రముఖులు ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసానికి తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. నటుడు వెంకటేష్‌, మోహన్‌బాబు, నిర్మాత సురేష్‌బాబు, ఎంపీ మురళీమోహన్‌, నిర్మాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, రమేష్‌ప్రసాద్‌, బండ్ల గణేష్‌, డైరెక్టర్‌ రాఘవేంద్ర, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు రాజేంద్రప్రసాద్‌ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో వీబీ రాజేంద్రప్రసాద్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .