English | Telugu

ధ‌నుష్ సినిమా షూటింగ్‌కి అంత‌రాయం.... అస‌లేమైంది?

ధ‌నుష్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం కెప్టెన్ మిల్ల‌ర్‌. త‌మిళ్ డైర‌క్ట‌ర్ అరుణ్ మాదేశ్వ‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌త్య‌జ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తోంది. జి.వి.ప్ర‌కాష్ సంగీతం అందిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌లోని ప‌లువురు న‌టీన‌టులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం తెన్‌కాసీ జిల్లా ప‌ళ‌య కుట్రాలం స‌మీపంలోని మ‌త్త‌ళంపారై గ్రామంలో సెట్ వేశారు. ప‌శ్చిమ క‌నుమ‌ల కిందుగా వేసిన గుడి సెట్ అంద‌రినీ మెప్పించింది. అక్క‌డికి ద‌గ్గ‌ర్లోని ఓ ఏరుమీద ఓ వార‌ధిని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి అక్క‌డే షూటింగ్ చేస్తున్నారు. అక్క‌డి సెంగుళం కాలువను మ‌ట్టి వేసి చాలా వ‌ర‌కు పూడ్చేసినందుకుగానూ, అక్క‌డి ఏరు మీద వార‌ధి క‌ట్టినందుకుగానూ లోక‌ల్ రైతులు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అట‌వీశాఖ ప‌రిధిలో ఉన్న అలాంటి ప్ర‌దేశాల్లో సినిమాల షూటింగ్ చేయాలంటే ప‌క్కాగా అనుమ‌తులు తీసుకోవాల్సిందే.

కానీ అట‌వీశాఖ అధికారులు అక్క‌డ షూటింగ్‌కి అనుమ‌తి ఇవ్వ‌లేద‌ట‌. దాంతో పాటు ఆ ప్రాంతంలో షూటింగ్‌కి సంబంధించి ఇత‌ర శాఖ‌ల్లోనూ ఎలాంటి అనుమ‌తులూ తీసుకోలేద‌ట‌. ఈ విష‌యం గురించి అడ‌పాద‌డ‌పా వార్త‌లు వ‌స్తూనే ఉన్నా, సినిమా యూనిట్ మాత్రం దీని గురించి ప‌ట్టించుకోకుండా చిత్రీక‌ర‌ణ చేసింది. ఈ నేప‌థ్యంలోనే బాంబులు పేలే స‌న్నివేశాల‌ను కూడా ఆ ప్రాంతంలో తెర‌కెక్కించారు. అయితే ఆ శ‌బ్దానికి, పొగ‌కు అట‌వీ ప్రాంతంలోని జంతువుల‌కు ఇబ్బంది క‌లుగుతోంద‌ని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దానికి తోడు బాంబు పేలుడు స‌న్నివేశాల‌ను యువ‌కులు మొబైల్‌లో చిత్రీక‌రించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయ‌డంతో, స్థానిక క‌లెక్ట‌ర్ షూటింగ్ ఆపాల‌ని ఆదేశించారు. దాంతో చిత్రీక‌ర‌ణ ఆగింది. దీని గురించి కెప్టెన్ మిల్ల‌ర్ యూనిట్ మాట్లాడుతూ ``మేం షూటింగ్ చేసిన ప్లేస్ ప్రైవేటు వ్య‌క్తుల‌ది. అయితే, మేం అట‌వీ ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నామ‌ని కొంద‌రు త‌ప్పుగా అర్థం చేసుకుని వైర‌ల్ చేశారు. అందువ‌ల్ల షూటింగ్ ఆపాల్సి వ‌చ్చింది. అన్నీ అనుమ‌తులు తీసుకుని మ‌ళ్లీ త్వ‌ర‌లోనే మొద‌లుపెడుతాం`` అని అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.