English | Telugu

ఇలాగైతే ఇక క(న)ష్టమే 'బ్రో'.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రిపోర్ట్!

తమిళ చిత్రం 'వినోదాయ సిత్తం' ఆధారంగా రూపొందిన రీమేక్ మూవీ 'బ్రో'. మెగా కాంపౌండ్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ ని సముద్రఖని తెరకెక్కించారు. ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్ళు రాబట్టిన ఈ చిత్రం.. సోమవారం నుంచి కలెక్షన్ల పరంగా తిరోగమన బాట పట్టింది. సోమవారం కంటే మంగళవారం వసూళ్ళు తగ్గగా.. ఆరో రోజైన బుధవారం మరింత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఏడో రోజైన గురువారం ప్రపంచవ్యాప్తంగా రూ. కోటి కంటే తక్కువ షేర్ చూసింది. దీంతో.. రూ. 97 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగిన 'బ్రో'.. ఇక బ్రేక్ ఈవెన్ మార్క్ చూడడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.01 కోట్ల షేర్ రాబట్టిన 'బ్రో' మూవీ.. రెండో రోజు రూ. 12. 32 కోట్ల షేర్, మూడో రోజు రూ. 12. 93 కోట్ల షేర్ ఆర్జించింది. ఇక నాలుగో రోజైన సోమవారం రూ. 2.96 కోట్ల షేర్, ఐదో రోజైన మంగళవారం రూ. 2. 20 కోట్ల షేర్, ఆరో రోజైన బుధవారం రూ. 1.84 కోట్ల షేర్ చూసింది. ఏడో రోజైన గురువారం రూ. 95 లక్షల షేర్ రాబట్టింది. మొత్తంగా.. తొలివారంలో (7 రోజులు) రూ. 63. 21 కోట్ల షేర్ (రూ. 105. 80 కోట్ల గ్రాస్) ఆర్జించింది 'బ్రో'. మరి.. వర్కింగ్ డేస్ లో అనుకున్నంతగా రాణించలేకపోయిన 'బ్రో'.. శని, ఆది వారాల్లోనైనా పుంజుకుంటుందేమో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.