English | Telugu

మోసపోవద్దు.. కీలక ప్రకటన చేసిన అన్నపూర్ణ స్టూడియోస్!

సినీ రంగంలో రాణించాలని ఎందరో ఆశపడుతుంటారు. అలాంటి వారి ఆశని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) పేరుతో కొందరు కేటుగాళ్లు అలాంటి మోసం చేయడానికి ప్రయత్నించారు.

తాము నిర్మించే సినిమాలో నటించడానికి నూతన నటీనటులు కావాలంటూ అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఒక క్యాస్టింగ్ కాల్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసి నిజంగానే అన్నపూర్ణ స్టూడియోస్ క్యాస్టింగ్ కాల్ అని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది అన్నపూర్ణ దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించింది. ఈ క్యాస్టింగ్ కాల్ ఫేక్ అని తెలిపింది. ఇటువంటి వారికి మీ వ్యక్తిగత సమాచారం పంపడం, డబ్బు పంపించడం వంటివి చేయకండని సూచించింది. తమ సంస్థ నుంచి ఏదైనా క్యాస్టింగ్ కాల్ ఉంటే.. అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానో లేక వెబ్ సైట్ ద్వారానో తెలియజేస్తామని అన్నపూర్ణ పేర్కొంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.