English | Telugu

ఈ దసరా బాలయ్యదే.. హ్యాట్రిక్ కొట్టాడు!

ఈ దసరాకు మూడు బడా సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన 'భగవంత్ కేసరి', దళపతి విజయ్ నటించిన 'లియో' నిన్న(అక్టోబర్ 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' నేడు(అక్టోబర్ 20న) విడుదలైంది. అయితే ఈ మూడు సినిమాల్లో 'లియో', 'టైగర్ నాగేశ్వరరావు' డివైడ్ టాక్ ని సొంతం చేసుకోగా.. 'భగవంత్ కేసరి' మాత్రం మొదటి షో నుంచే అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

'అఖండ', 'వీరసింహారెడ్డి' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత బాలయ్య నటించిన సినిమా కావడంతో 'భగవంత్ కేసరి'పై ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. యాక్షన్, కామెడీతో పాటు బలమైన ఎమోషన్స్ తో రూపొందిన 'భగవంత్ కేసరి'.. ఆ అంచనాలను అందుకుంది. బాలయ్యని దర్శకుడు అనిల్ రావిపూడి చూపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉన్నాయి.

'భగవంత్ కేసరి'తో పోలిస్తే 'లియో', 'టైగర్ నాగేశ్వరరావు' ఓ వర్గం ప్రేక్షకులకు పరిమితమయ్యే సినిమాలు. ఈ రెండు సినిమాల కోసం యాక్షన్ ప్రియులు బాగానే ఎదురుచూశారు. కానీ ఇప్పుడు రెండు సినిమాలకు హిట్ టాక్ రాకపోవడంతో వారు కూడా ఆదరించడం అనుమానమే. 'భగవంత్ కేసరి' పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ సినిమాకి హిట్ టాక్ వచ్చి, పోటీగా విడుదలైన రెండు సినిమాలకు డివైడ్ టాక్ రావడం కలిసొచ్చింది. పైగా ఇందులో యూత్, మాస్, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని భావోద్వేగ సన్నివేశాలు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా ఉన్నాయి. పండగ సీజన్ లో కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమాల వైపు ప్రేక్షకులు మొగ్గు చూపుతారు. ఆ పరంగా ఇప్పుడు 'భగవంత్ కేసరి'నే అందరికీ ఫస్ట్ ఛాయిస్ అవుతుంది. అందుకే షో షోకి వసూళ్లు పెరుగుతున్నాయి. మొదటిరోజే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.20 కోట్ల షేర్ రాబట్టిన 'భగవంత్ కేసరి'.. ఫుల్ రన్ లో 'అఖండ', 'వీరసింహారెడ్డి' స్థాయి వసూళ్లు రాబట్టే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.