English | Telugu

‘భగవంత్‌ కేసరి’ కలెక్షన్ల జోరు.. 10 రోజుల్లోనే రూ.124 కోట్లు

‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎంతటి ఆసక్తి ఉంటుందో, ఆ సినిమాపై ఎన్ని అంచనాలు ఏర్పడతాయో తెలియంది కాదు. అయినా తన మీద తనకున్న కాన్ఫిడెన్స్‌తోనే బాలకృష్ణ ఒక కొత్త తరహా సినిమా చెయ్యాలని డిసైడ్‌ అయ్యారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా అంటే అది ఏ జోనర్‌లో ఉంటుంది, డైరెక్టర్‌ జోనర్‌లోనా, లేక హీరో ఇమేజ్‌కి తగిన జోనర్‌లోనా.. ఇలా రకరకాల ఊహాగానాల మధ్య, భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ నడుమ విడుదలైన ‘భగవంత్‌ కేసరి’ అందరి అంచనాలను మించి ఘన విజయం సాధించింది. రోజురోజుకీ పెరుగుతున్న కలెక్షన్స్‌ బాలయ్యను దసరా విన్నర్‌ని చేశాయి.

మొదటి వారంలోనే రూ.112 కోట్లు కలెక్ట్‌ చేసిన ‘భగవంత్‌ కేసరి’ రెండో వారంలోనూ తన దూకుడుని కంటిన్యూ చేశాడు. పోటీగా రెండు సినిమాలు రిలీజ్‌ అయినప్పటికీ వాటిని పక్కకు నెట్టి ముందుకు దూసుకుపోయాడు. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం, ‘భగవంత్‌ కేసరి’కి యునానిమస్‌ టాక్‌ రావడంతో కేవలం 10 రోజుల్లోనే రూ.123.92 కోట్ల గ్రాస్‌ అంటే దాదాపుగా రూ.124 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ‘భగవంత్‌ కేసరి’ ఉన్న ఊపు చూస్తుంటే త్వరలోనే రూ.150 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని అభిమానులు ఎంతో ఉత్సాహంగా చెబుతున్నారు. బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాలుగా ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాలు రూ.130 కోట్ల వరకు కలెక్ట్‌ చెయ్యగలిగాయి. ఇప్పుడు ‘భగవంత్‌ కేసరి’కి ఉన్న జోరు చూస్తుంటే ఈ రెండు సినిమాలను సునాయాసంగా క్రాస్‌ చేస్తుందనిపిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.