English | Telugu

ఘనంగా యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య నిశ్చితార్థం

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య, తమిళ నటుడు, దర్శకుడు తంబి రామయ్య కుమారుడు, యంగ్‌ హీరో ఉమాపతి రామయ్యను వివాహం చేసుకోబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం శుక్రవారం జరిగింది. చెన్నైలో అర్జున్‌ నిర్మించిన హనుమాన్‌ టెంపుల్‌లో ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఇరు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో నిర్వహించారు. ఐశ్వర్య, ఉమాపతిల వివాహం 2024 సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో ఉంటుందని అర్జున్‌ తెలిపారు. ఇరు కుటుంబాలకు చెందిన వారు మాత్రమే ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు. పెళ్ళికి మాత్రం అందర్నీ ఆహ్వానిస్తామని అర్జున్‌ ఈ సందర్భంగా తెలిపారు.

ఈ నిశ్చితార్థ వేడుకలో ఉమాపతి రామయ్య డ్రస్‌ని ముంబైకి చెందిన మనీష్‌ మల్హోత్రా డిజైన్‌ చేయగా.. ఐశ్వర్య అర్జున్‌ ధరించిన డ్రస్‌ను జయంతి రెడ్డి డిజైన్‌ చేశారు. 5 క్యారెట్‌ బర్మీస్‌ రూబీ విత్‌ డైమండ్‌ అండ్‌ వైట్‌ గోల్డ్‌తో చేసిన రింగ్‌ని ఐశ్వర్య అర్జున్‌ ధరించగా.. ఉమాపతి కూడా గోల్డ్‌ అండ్‌ డైమండ్‌ రూబీ ధరించారు. హనుమాన్‌ టెంపుల్‌లోని రాముల వారి విగ్రహం ముందు ఐశ్వర్య-ఉమాపతి నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకున్నారని అర్జున్‌ తెలియజేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.