English | Telugu

‘కన్నప్ప’ షూటింగ్‌లో ప్రమాదం.. మంచు విష్ణుకు గాయాలు!

గత కొన్నిరోజులుగా మంచు విష్ణు చేస్తున్న ‘కన్నప్ప’ సినిమాకి సంబంధించిన వార్తలు విరివిగా రావడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్‌ పడినట్టు తెలుస్తోంది. షూటింగ్‌ జరుగుతున్న సమయంలో మంచు విష్ణు గాయపడ్డాడని వార్తలు వస్తున్నాయి. గాయపడిన విష్ణుని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. పెద్ద ప్రమాదం కాకపోయినా షూటింగ్‌ జరిగే పరిస్థితి లేకపోవడంతో క్యాన్సిల్‌ చేశారు.
‘కన్నప్ప’ అనే టైటిల్‌తో విష్ణు సినిమా చేస్తున్నాడనే వార్త మీడియాలో రావడం, ఈ సినిమాలో ప్రభాస్‌, మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ వంటి స్టార్‌ హీరోలు కూడా నటిస్తున్నారని తెలియడంతో సినిమా రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. తీసుకొస్తున్నాడు మంచు విష్ణు. దీంతో కన్నప్ప రేంజ్‌ ఒక్కసారిగా అలా పెరిగిపోయింది. వీరితోపాటు మరికొందరు స్టార్లు కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉందన్న వార్తలు కూడా రావడంతో ఎవ్వరూ ఊహించని రేంజ్‌కి సినిమా వెళ్లిపోయింది.
‘కన్నప్ప’ షూటింగ్‌లో ప్రమాదం ఎలా జరిగింది?
ఈ సినిమాలోని కొన్ని యాక్షన్స్‌ సీక్వెన్సులను డ్రోన్‌ సాయంతో షూట్‌ చేస్తున్నారట. ఈ క్రమంలోనే డ్రోన్‌ అదుపు తప్పి నేరుగా వచ్చి మంచు విష్ణు మీద పడిరదట. దాంతో అతని చేతికి పలుచోట్ల తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న విష్ణు క్షేమంగానే ఉన్నాడని సమాచారం. అయితే కొన్ని రోజులపాటు షూటింగ్‌ను వాయిదా వేశారని తెలుస్తోంది.
‘మహాభారతం’ సీరియల్‌ను బుల్లితెరపై అత్యద్భుతంగా తీసిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ‘కన్నప్ప’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్‌, తోట ప్రసాద్‌ వంటి ప్రముఖులు ఈ సినిమాకు రచనా సహకారం అందిస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.