English | Telugu

బండ్ల టార్గెట్ ... ఆ ఐదుగురు హీరోలే!

కొడితే ఏనుగు కుంభ‌స్థలాన్నే కొడ‌తా అంటున్నాడు గ‌ణేష్‌. చిన్న సినిమాలు తీస్తే రిస్క్ ఎక్కువ‌ని అందుకే తాను పెద్ద హీరోల‌నే న‌మ్ముకొంటాన‌ని తేల్చి పారేశాడు. ప‌వ‌న్‌, మ‌హేష్‌, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, బ‌న్నీ.... ఈ ఐదుగురు హీరోల చుట్టే తిరుగుతాన‌ని మొహ‌మాటం లేకుండా చెప్పేస్తున్నాడు. ``పెద్ద సినిమాల‌లో రిస్క్ త‌క్కువ‌. హీరోని చూపించి వ్యాపారం చేసుకోవచ్చు. సినిమాని అమ్మేసుకోవ‌చ్చు. మంచి సినిమా తీసి పేరు తెచ్చుకోవాల‌ని నాకు ఏమాత్రం లేదు. నాకు డ‌బ్బులు ముఖ్యం`` అంటూ ఓ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు గ‌ణేష్‌. అంతేకాదు.. త‌న స్ట్రాట‌జీని కూడా బ‌య‌ట‌పెట్టాడు. ఇండ్ర‌స్ట్రీలో మిత్రులు, శ‌త్రువులు ఉండ‌ర‌ట‌. హిట్‌తో స్నేహం చేయాలి, ఫ్లాప్ నే శ‌త్ర‌వు అనుకోవాల‌ని కొత్త స్టేట్‌మెంట్ ఇచ్చాడు. త‌న‌కు అందరు హీరోలూ కావాల‌ని... త‌న‌తో సినిమా తీసే హీరోనే త‌న‌కు దేవుడ‌ని చెబుతున్నాడు బండ్ల‌. ఎప్పుడూ అతిశ‌యోక్తులు మాట్లాడే గ‌ణేష్ తొలిసారి.. మ‌న‌సు విప్పి నిజం చెప్పాడు కదూ.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.