English | Telugu

హరికృష్ణను ఓదార్చిన బాలయ్య


రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి జానకిరామ్‌ బౌతికకాయన్ని నందమూరి బాలకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. ఆదివారం ఆయన సతీమణి వసుంధరతో కలిసి హరికృష్ణ ఇంటికి చేరుకున్న బాలయ్య అన్నను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అనంతరం జానకీరామ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. జానకిరామ్‌ బౌతికకాయన్ని చూసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు.


రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి జానకిరామ్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్‌, దర్శకుడు రాఘవేంద్ర, ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీప్రణీత, లక్ష్మీపార్వతి, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు జానకిరామ్‌కు పూలమాల వేసి నివాళులర్పించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.