English | Telugu

జానకీరామ్ అంత్యక్రియలు పూర్తి

నందమూరి హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్ అంత్యక్రియలు సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. మొయినాబాద్ మండలం ముర్తుజాగూడలోని ఫాంహౌస్ లో జానకీ రామ్ పార్థీవదేహానికి అతని కుమారుడు చిన్నారి తారకరామారావు నిప్పటించారు. తారకరామారావు వెంటే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఉన్నారు. నల్గొండ జిల్లా మునుగాల మండలం ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జానకి రామ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అంతకుముందు హరికృష్ణ నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభమైంది. జానకి రామ్ తండ్రి హరికృష్ణ, సోదరులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, బంధువులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.