English | Telugu

బాహుబ‌లి కోసం.. 5వేల థియేట‌ర్లు

స‌రికొత్త చ‌రిత్ర దిశ‌గా బాహుబ‌లి అడుగులు వేస్తోంది. విడుద‌ల‌కు ముందే అన్ని రికార్డుల‌నూ త‌న పేర లిఖించుకోవ‌డానికి ఉవ్విళ్లూరుతోంది. ఇప్ప‌టికే... బ‌డ్జెట్ విష‌యంలో బాహుబ‌లి స‌రికొత్త రికార్డులు సృష్టించింది. రూ.250 కోట్ల సినిమా అంటూ.. అంద‌రూ బాహుబ‌లిని కీర్తిస్తున్నారు. మ‌రి ఇంత భారీ బ‌డ్జెట్ సినిమాని ఎక్కువ మందికి చేరువ కావాలి క‌దా. అందుకే విడుద‌ల విష‌యంలోనూ చిత్ర‌బృందం క‌నీవినీ ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు టాక్‌.

బాహుబ‌లిని ప్ర‌పంచ వ్యాప్తంగా 5000 థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి ఆర్కా మీడియా ప్లాన్ చేస్తోంది. ఆంధ్ర‌, తెలంగాణా రాష్ట్ర్రాల్లోనే దాదాపుగా 1900 థియేట‌ర్ల‌లో బాహుబ‌లిని ప్ర‌ద‌ర్శిస్తారు. బాలీవుడ్‌తో పాటు... అన్ని రాష్ట్ర్రాల్లోనూ, విదేశాల్లోనూ మొత్తంగా 3వేల థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.

మొత్తంగా తొలి మూడు రోజుల్లోనే వంద కోట్లు వ‌సూలు చేయ‌డానికి బాహుబ‌లి టీమ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌లు వేసుకొంది. మ‌రి రాజ‌మౌళి ప్లాన్ ఎంత వ‌ర‌కూ వ‌ర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఇంకో ప‌ది రోజులు ఆగితే స‌రిపోతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.