English | Telugu

ప్ర‌భాస్ బాగా బ‌ల‌వంతం చేశాడ‌ట‌!

ప్ర‌భాస్ అతిథి మ‌ర్యాద‌ల గురించి సెట్లో అంద‌రూ గొప్ప‌గా చెప్తుంటారు. ప్ర‌తి రోజూ షూటింగ్‌కి ప్ర‌భాస్ కోసం క్యారియ‌ర్ల‌కు క్యారియ‌ర్లు మోసుకొస్తుంటార‌ట‌. ప్ర‌భాసేమో డైటింగ్‌లో ఉంటాడు. అందుకే ప్ర‌భాస్‌తో పాటున్న‌వాళ్లంతా ఆ ఇంటి భోజ‌నం లాగించాల్సిందేన‌ట‌. ప్ర‌భాస్ ద‌గ్గ‌రుండి మ‌రీ ఒడ్డిస్తాడ‌ట‌. 'క‌డుపు నిండిపోయింది బాబోయ్‌' అన్నా వ‌దిలిపెట్ట‌డ‌ట‌. ఒక ద‌శ‌లో ఇదేదో టార్చ‌ర్‌లా అనిపిస్తుంద‌ట‌.

త‌మ‌న్నా కూడా ఈ టార్చ‌ర్ అనుభ‌వించింద‌ట‌. ''ప‌ది ప‌దిహేను ర‌కాల వంట‌కాల‌తో ప్ర‌భాస్ ఇంటి నుంచి క్యారియ‌ర్ వ‌స్తుంది. దాదాపుగా అన్నీ నాన్ వెజ్ వంట‌కాలే. నేనేమో... కొంచెం కొంచెం తినే టైపు. కానీ ప్ర‌భాస్ మాత్రం బ‌ల‌వంతంగా అన్ని వెరైటీలూ ద‌గ్గ‌రుండి తినిపించేవాడు. క‌డుపు నిండిపోయినా వ‌దిలేవాడు కాదు. ఇంకా తినండి.. అంటూ వ‌డ్డించేవాడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే తిండిపెట్టీ పెట్టి విసిగించేశాడు...'' అని బాహుబ‌లి సెట్లో అనుభ‌వాల్ని పంచుకొంది త‌మ‌న్నా.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.