English | Telugu

మే 10 వ తేదీన అల్లు అర్జున్ బద్రీనాథ్ ఆడియో

మే 10 వ తేదీన అల్లు అర్జున్ బద్రీనాథ్ ఆడియో రిలీజ్ చేయనున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మిల్కీవైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న విభిన్నకథా చిత్రం "బద్రీనాథ్". ఈ చిత్రానికి ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ కథనందించారు. ఈ చిత్రంలో హీరో అల్లు అర్జున్ ఇండియన్ సమురాయ్ యోధుడిగా నటిస్తున్నారు. ఇందుకోసం అల్లు అర్జున్ థాయ్ ల్యాండ్ వెళ్ళి ఫైట్ మాస్టర్ పీటర్ హేయిన్స్ నేతృత్వంలో, అక్కడ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రం ఆడియో రిలీజ్ ను ముందుగా మే నెల 8 వ తేదీన రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రమ యొక్క ఆడియోని మే నెల పదవ తేదీన రిలీజ్ చేయనున్నారట.


ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" చిత్రాన్ని ముందుగా అనుకున్న ప్రకారం మే 19 వ తేదీన కాకుమడా మే నెల 21 వ తేదీన విడుదల చేయాని నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గెటప్ దగ్గర నుండీ అన్నీ రొటీన్ కి భిన్నంగానే ఉండటం విశేషం. "బన్నీ" చిత్రం తర్వాత వినాయక్ దర్శకత్వంలోల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ఈ అల్లు అర్జున్ "బద్రీనాథ్" కావటంతో ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మే 10 వ తేదీన రిలీజ్ కాబోయే అల్లు అర్జున్ బద్రీనాథ్ ఆడియోని "మా" టివి లైవ్ టెలికాస్ట్ చేయనుందట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.