English | Telugu

సమస్య మీద పోరాడే శ్రీకాంత్ దుశ్శాసన

తమ హీరో సమస్య మీద పోరాడే దుశ్శాసన అని "దుశ్శాసన" చిత్రం యూనిట్ తెలియజేసింది. వివరాల్లోకి వెళితే లాఫింగ్ లార్డ్ పతాకంపై, కుటుంబకథా చిత్రాల హీరో శ్రీకాంత్ హీరోగా, విభిన్న చిత్రాల దర్శకుడు, రచయిత, నటుడు, నిర్మాత అయిన పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో, మురళీ కృష్ణ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం శ్రీకాంత్ "దుశ్శాసన". ఈ శ్రీకాంత్ "దుశ్శాసన" చిత్రంలో మన సమాజంలోని సమస్యల మీద జరిగే పోరాటాన్నే నేపథ్యంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించామనీ, ఈ "దుశ్శాసన" ఏ ఒక్క వ్యక్తినో, లేదా ఏ ఒక్క సంస్థనో విమర్శించే సినిమా కాదనీ ఈ చిత్ర దర్శకుడు పోసాని కృష్ణ మురళి అన్నారు.

ఈ "దుశ్శాసన" చిత్రంలో హీరోగా నటిస్తున్న శ్రీకాంత్ మాట్లాడుతూ గతంలో పోసాని దర్శకత్వంలో తాను "ఆపరేషన్ దుర్యోధన" చిత్రంలో నటించాననీ, ఆ చిత్రం లానే ఈ శ్రీకాంత్ "దుశ్శాసన" చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందనీ అన్నారు. ఈ శ్రీకాంత్ "దుశ్శాసన" చిత్రంలో శ్రీకాంత్ చేగువెరా గెటప్ లో కనిపించటం విశేషం. ఈ చిత్ర నిర్మాత మురళీ కృష్ణ ప్రసంగిస్తూ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉందనీ, అందుకే శ్రీకాంత్ "దుశ్శాసన" పేరు ముద్రించిన పేపర్ గ్లాసులు ఓ పదిలక్షలు తయారుచేసి పంపిణీ చేస్తున్నామనీ, తమ శ్రీకాంత్ "దుశ్శాసన" చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తామని అన్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.