English | Telugu

బాబు మూవీతో అర్జున్ కళ్యాణ్...


బిగ్ బాస్ ద్వారా ఆడియన్స్ కి బాగా రీచ్ ఐన మోడల్, యాక్టర్ అర్జున్ కళ్యాణ్. అలాగే శ్రీసత్యతో గతంలోనే పరిచయం ఉండడంతో వీళ్ళ మధ్య సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు అర్జున్ కళ్యాణ్, శ్రీసత్య ఎవరి లైఫ్ తో వాళ్ళు బిజీ ఇపోయారు. అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ కి వాటికి కలుస్తూ ఉంటారు. అలాంటి అర్జున్ కళ్యాణ్ తన నెక్స్ట్ అప్ డేట్స్ విషయమై ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు.

"నేను బాబు అనే కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యింది..ఇప్పుడు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ప్రమోషన్స్ ని మొదలుపెడతాం ఆల్రెడీ హీరోయిన్ పోస్టర్స్ అన్నీ రెడీ అయ్యాయి. కుషిత కళ్ళాపు పిక్స్ రిలీజ్ కూడా అయ్యాయి.. ఐతే రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నాం. మే బి జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఉండొచ్చు.

ఈ మూవీతో పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ తో కలిసి ఒక వెబ్ సిరీస్ లో చేయడానికి ఆల్రెడీ సైన్ చేసాను. ప్రస్తుతానికి ఒక షెడ్యూల్ ని పూర్తి చేసాను. ఐతే కొంత మంది నటుల డేట్స్ కొంచెం ప్రాబ్లమ్ గా ఉంది..అలాగే బ్రహ్మాజీ, ఆమని గారు నాకు పేరెంట్స్ రోల్స్ లో నటిస్తున్నారు. రవిశివతేజ నా బ్రదర్ గా చేస్తున్నాడు, అన్యుక్త నాతో జోడీగా నటిస్తోంది. గాయత్రీ చాగంటి రవికి పెయిర్ గా నటిస్తోంది. " అని చెప్పాడు. అలాగే బిగ్ బాస్ సెవెన్ లో శివాజీ బాగా ఆడుతున్నాడని చెప్పాడు. "ఎలిమినేషన్స్ కి ఓటింగ్ కి లింక్ ఉండదు..బిగ్ బాస్ టీమ్ కి కావాల్సిన కంటెంట్ వచ్చాక వాళ్ళు హౌస్ నుంచి పంపించేస్తారు వోటింగ్ ఉన్నా లేకపోయినా..ఎందుకంటే అది రియల్ షో కాదు రియాలిటీ షో మరి...బిగ్ బాస్ కి రేటింగ్ ఇంపార్టెంట్ అంటే ఏడవడాలు, కొట్టుకోవడాలు, అరుచుకోవడాలు, లవ్ ట్రాక్ ఇలాంటివే ఎక్కువగా చూస్తారు. బిగ్ బాస్ ని, అందులోని కంటెస్టెంట్స్ ని మరీ పర్సనల్ గా తీసుకోకండి..డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుంది." అంటూ బిగ్ బాస్ గురించి చాలా విషయాలు చెప్పాడు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.