English | Telugu

మురుగదాస్ ఆ విషయంలో దివ్యాంగుడా!.. వైరల్ అవుతున్న స్పీచ్ 

భారతీయ చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథల్నిప్రేక్షకులకి అందించే దర్శకుల్లో 'ఏఆర్ మురుగదాస్'(Ar Murugadoss)కూడా ఒకరు. గజనీ, 7th సెన్స్, స్టాలిన్, తుపాకీ, సర్కార్, కత్తి వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఈ ఏడాది 'సల్మాన్ ఖాన్'(Salman Khan)తో 'సికందర్'(Sikandar)అనే మూవీని తెరకెక్కించాడు. 'ఈద్'(Eid)కానుకగా' విడుదలైన సికందర్ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో 'శివకార్తికేయన్'(Sivakarthikeyan)తో 'మదరాసి'(Madarasi)అనే మరో వినూత్నమైన సబ్జెట్ ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా ఒక కార్యక్రమం జరిగింది. అందులో మురుగదాస్ మాట్లాడుతు' హిందీ చిత్రాలకి వర్క్ చేసే సమయంలో నేను దివ్యాంగుడిని. ఎందుకంటే సికందర్ కి సంబంధించి లాంగ్వేజ్ విషయంలో గందరగోళానికి గురయ్యాను. తెలుగులో కొంత వరకు పర్లేదు. హిందీలో మాత్రం నాకు ఏమి అర్ధం కాదు. నేను రాసుకున్న సీన్ పై నాకు అవగాహన ఉంటుంది. స్కిప్ట్ ఇవ్వగానే ఇంగ్లీష్ నుంచి హిందీకి అనువదించుకుంటారు. దీంతో షూట్ లో డైలాగుల విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. నా మాతృభాష తమిళంలో సినిమాలు చెయ్యడం నాకు సులువు. ఇక్కడ వారికి ఏ కథ నచ్చుతుందో నాకు తెలుసు. సోషల్ మీడియాలో డైలాగులు, వైరల్ అయ్యే క్యాప్షన్స్ పై నాకు అవగాహన ఉండటంతో,యూత్ కి ఏం నచ్చుతుందో తెలుస్తుంది. ఇతర భాషల విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. నా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పై మాత్రమే ఆధారపడాలని చెప్పుకొచ్చాడు

ఇక 'మదరాసి'లో శివకార్తికేయన్ సరసన 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)జత కడుతుండగా, విద్యుత్, బీజూ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్(Anirudh Ravichander)సంగీత దర్శకుడు కాగా సెప్టెంబర్ 5 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.