English | Telugu

‘యానిమల్’ సునామికి సాక్ష్యం 

డిసెంబర్ 1 .. ఈ డేట్ ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీ లో చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఈ డేట్ లో విడుదలైన యానిమల్ ఇప్పుడు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది.కేవలం మూడంటే మూడు రోజుల్లో యానిమల్ సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు టాక్ అఫ్ ది పాన్ ఇండియాగా మారాయి.

యానిమల్ మూవీ కేవలం మూడంటే మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 356 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించింది. తొలి రోజు 116 కోట్ల గ్రాస్ ని సాధించిన యానిమల్ ఆ తర్వాత రెండు రోజులకి అంటే వీకెండ్స్ అయిన శని, ఆదివారాల్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ ని సాధించింది. ఇప్పుడు ఈ కలెక్షన్స్ తో సినిమా హిట్ రేంజ్ అందరికి అర్ధం అయ్యింది. విడుదల అయిన అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ తో దూసుకెళ్తున్న యానిమల్ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

యానిమల్ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ వన్ మాన్ షో తో పాటు రష్మిక, అనిల్ కపూర్, బాబీ డియోల్ పెర్ఫార్మెన్స్ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ ని భద్రకాళి స్టూడియోస్ ,సినీ వన్, టి సిరీస్ ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగాలు నిర్మించారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.