English | Telugu

మరీ ఇంత కలెక్షన్ల..యానిమల్ మూవీ 10 వ రోజు ఇంతే!

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయగుండం అయిన తీరం దాటి తగ్గుముఖం పడుతుందేమో గాని యానిమల్ కలెక్షన్స్ మాత్రం ఇప్పుడప్పుడే తగ్గేలా లేవు.యానిమల్ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇప్పటికి పది రోజులు కావస్తోంది. కానీ ఎక్కడ కూడా యానిమల్ కలెక్షన్స్ మాత్రం తగ్గడం లేదు. లేటెస్ట్ గా ఈ మూవీకి వచ్చిన కలెక్షన్స్ ల లెక్కలు సినీ ట్రేడ్ వర్గాల వారిని విస్మయపరుస్తున్నాయి.

డిసెంబర్ 1 న విడుదల అయిన యానిమల్ విడుదల రోజు నుంచే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ ని సృష్టిస్తు ముందుకు దూసుకుపోతుంది. ఇప్పడు ఇంకో సరికొత్త రికార్డుని యానిమల్ తన ఖాతాలో వేసుకుంది. 10 రోజులకి 717 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ గా అక్షరాలా 717 .46 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఇప్పుడు ఈ ఫిగర్ తో ఎన్టీఆర్ తన సినిమాలో ఇది దయా గాడి దండయాత్ర అని చెప్పినట్టు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు యానిమల్ దండయాత్ర చేస్తుంది.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ రష్మిక హీరో హీరోయిన్లు గా వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు చూస్తున్నంత సేపు కూడా ఒక కొత్త రకం మూవీని చూస్తున్నామని భావిస్తుండబట్టే యానిమల్ మూవీకి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయని ఇండియన్ సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.