English | Telugu

పాపం.. అన‌సూయ‌ని బూతులు తిట్టార‌ట‌!

ఈ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్లు వ‌చ్చాక‌.. సెల‌బ్రెటీల‌కు ప్ర‌శాంత‌త లేకుండా పోయింది. ఫేస్ బుక్ , ట్విట్ట‌ర్‌ల‌ను వేదిక‌గాచేసుకొని సెల‌బ్రెటీలు త‌మ స‌మాచారాన్నంతా ఫ్యాన్స్‌కి ఇవ్వాల‌నుకొంటారు. కానీ కొంత‌మంది అభిమానం మ‌రీ వెర్రి త‌ల‌లు వేస్తుంటుంది క‌దా..?? అందుకే ఫేస్ బుక్ , ట్విట్ట‌ర్‌ల‌లో అస‌భ్య‌మైన కామెంట్ల‌తో చిరాకు తెప్పిస్తుంటారు. ఇలాంటివి టాప్ యాంక‌ర్ అన‌సూయ‌కూ ఎదుర‌య్యాయ‌ట‌. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా చెప్పుకొచ్చింది. సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్లో కొంత‌మంది దురాభిమానులు త‌న‌ను బండ‌బూతులు తిట్టేవార‌ట‌. అయితే వాటిని అన‌సూయ ఎప్పుడూ డిలీజ్ చేయ‌లేద‌ట‌. వాళ్ల త‌ప్పు వాళ్లే తెలుసుకొంటారు అని వ‌దిలేసేద‌ట‌. కొంత‌మందికి రిప్లై కూడా ఇచ్చేద‌ట‌. మీ ఇంట్లో ఆడ‌వాళ్ల‌తో మీరు ఇలానే మాట్లాడ‌తారా?? అని తిరిగి స‌మాధానం ఇచ్చేద‌ట‌. దాంతో అవ‌త‌లివాళ్లు కామ్ అయిపోయేవార‌ట‌. అద్దాల మేడ‌మీద రాళ్లు వేయాల‌నుకొంటారు.. బ‌ద్ద‌లైతే అదో ఆనందం వాళ్ల‌కు అలాంటి వాళ్ల‌ని మ‌నం ఏం చేయ‌గ‌లం?? అంటూ తెగ ఫీలైపోతోంది అన‌సూయ‌. సెల‌బ్రెటీ అనేస‌రికి ఇవి కూడా భ‌రించాలి మ‌రి..!!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.