English | Telugu

అల్ల‌రోడికి దెబ్బడిపోయింది

'మూలిగే న‌క్క‌పై తాటికాయ్ ప‌డిన‌ట్టుంది మ‌న అల్ల‌రి న‌రేష్ ప‌రిస్థితి. అస‌లే హిట్లు లేవు. ఆ మాట విని అయ్యగారికి చాలాకాలం అయ్యింది. ఎంత కామెడీ చేసినా జ‌నం న‌వ్వ‌డం లేదు. ఇప్పుడాయ‌న నిర్మాత‌గానూ మారాడు.... బందిపోటుతో. ఫ‌లితం శూన్యం. తొలిరోజే ఈ సినిమా డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకొంది. న‌రేష్‌కి ఉన్న మినిమం గ్యారెంటీ హీరో ట్యాగ్ లైన్ ఈ సినిమాతో మ‌టాష్ అయిపోయిన‌ట్టే. ఎంద‌కంటే ఈ సినిమాని ఎవ్వ‌రూ కొన‌లేదు. బ‌య్య‌ర్లు అల్ల‌రోడి సినిమాని కొన‌డానికి ధైర్యం చేయ‌లేక‌పోయారు. ఆఖ‌రికి శాటిలైట్ కి కూడా అమ్ముడు పోలేదు. న‌రేష్ ఓవ‌ర్ కాన్పిడెన్స్ కొద్దీ..`ఈ సినిమా రిలీజ్ అయ్యాక చూసుకొందాంలే.. అప్పుడు మంచి రేటు వ‌స్తుంది` అని.. ఎవ్వ‌రికీ ఇవ్వ‌లేదు. అంతేకాదు.. చాలా ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకొన్నాడు. తొలి రోజు 50 శాతం ఆక్యుపెన్సీ కూడా క‌నిపించ‌లేదు. దాంతో.. న‌రేష్ కి ఫుల్లుగా మ‌డ‌త‌డిపోయింది. హీరోగా, నిర్మాత‌గా రెండు విధాలా లాసైపోయాడు. శ‌నివారం వ‌సూళ్లు ఓ మాదిరిగా ఉంటాయ్‌. ఆదివారం ఇండియా - సౌతాఫ్రికా వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ ఉంది. సో.. మార్నింగ్ షో, మ్యాట్నీలు ఔట్‌. ఈలోగా టాక్ బాగా స్ప్రెడ్ అయిపోతే.. బందిపోటు సోమ‌వారం నుంచి థియేట‌ర్ల‌లో క‌న‌ప‌డ‌ని ప్ర‌మాదం పొంచి ఉంది. సో బ్యాడ్ ల‌క్ న‌రేష్‌.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.