English | Telugu

గుంపులో నటించను.. అలాంటి పార్టీలకు వెళ్ళను

యాంకర్‌ అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటుంది. ఆమె తన కెరీర్ లో దూసుకుపోతోంది. జబర్దస్త్ కామెడీ షో తో స్మాల్ స్క్రీన్ మీద పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం మూవీస్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. రంగస్థలం, పుష్ప, రీసెంట్ గా వచ్చిన విమానం మూవీస్ ఆమె రేంజ్ ని పూర్తిగా మార్చేశాయి. ఇక‌ అనసూయ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ రకరకాల కామెంట్లు చేస్తూ ఎప్పుడూ లైం లైట్ లో ఉంటూనే ఉంటుంది. అలాగే హాట్ హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. అలాంటి అనసూయ రీసెంట్ గా చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో ఆయన పక్కన నటించే ఛాన్స్ వస్తే వదులుకున్న విషయం చెప్పింది అనసూయ. అత్తారింటికి దారేది మూవీలో స్పెషల్ సాంగ్‌లో పవన్ పక్కన డ్యాన్స్ చేసే అవకాశం వస్తే గుంపులో గోవిందా అన్నట్టుగా ఐపోతానేమో అని తాను ఆ సాంగ్ లో నటించలేను అని త్రివిక్రమ్‌ కి కూడా చెప్పానంది అనసూయ. గుంపులో నటించడం ఇష్టం ఉండదు ఎందుకంటే తనకు ఎప్పుడు అందరిలోకి స్పెషల్ గా ఉండాలని అనుకుంటుందట. అందుకే ఆ పాటకు నో చెప్పానని.. ఆ టైంలో తనపై చాలా విమర్శలు వచ్చినా పట్టించుకోలేదని అనసూయ చెప్పింది. తానెప్పుడూ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని, ఐతే త్రివిక్రమ్‌కి సారీ చెప్పినట్టు అనసూయ తెలిపారు. షూటింగ్స్‌లో తన పని తానూ చూసుకుని వెళ్లిపోతానని చెప్పింది. మూవీ షూటింగ్స్ అయ్యాక జరిగే పార్టీలకు దూరంగా ఉండడం వల్లనే తాను హీరోయిన్ అవకాశాలను కోల్పోయినట్లు చెప్పింది. అనసూయ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.