English | Telugu

బ‌న్నీకీ హ‌న్సిక‌కీ మ‌ధ్య ఏం జ‌రిగింది?


దేశ‌ముదురుతో అల‌రించిన జంట‌... అల్లు అర్జున్ - హ‌న్సిక‌. ఆ సినిమా వ‌చ్చి దాదాపుగా ప‌దేళ్ల‌య్యింది. ఆ త‌ర‌వాత ఈ జంట‌ని మ‌ళ్లీ తెర‌పై చూసే అవ‌కాశం రాలేదు. ఇటీవ‌ల బ‌న్నీ - బోయ‌పాటి సినిమాకి హ‌న్సిక‌ను క‌థానాయిక‌గా ఎంచుకొన్నార‌ని చెప్పుకొన్నారు. అయితే ఆ స్థానంలోకి ర‌కుల్ వ‌చ్చి చేరిపోయింది. హ‌న్సిక‌ను ప‌క్క‌న పెట్ట‌డం వెనుక బ‌న్నీ ఉన్నాడ‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్.

బోయ‌పాటి శ్రీ‌ను హ‌న్సిక వైపు మొగ్గు చూపితే.. బ‌న్నీ మాత్రం 'హ‌న్సిక వ‌ద్దు' అని గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. దాంతో హ‌న్సిక ఈ సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని టాక్‌. దాంతో బ‌న్నీకి, హ‌న్సిక‌కీ మ‌ధ్య ఏదో జ‌రిగింద‌ని, అది బ‌న్నీ మ‌న‌సులో పెట్టుకొన్నాడ‌ని మెగా కాంపౌండ్ లోనూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తెలుగులో హ‌న్సిక చేసిన తొలి సినిమా దేశ‌ముదురు. ఆ టైమ్‌లోనే హ‌న్సికి హెడ్ వెయిట్ కాస్త ఎక్కువ‌గా ఉండేద‌ట‌. అది న‌చ్చ‌కే.. బ‌న్నీ ఆమెను ప‌క్క‌న పెట్టాడ‌ని తెలుస్తోంది. అయితే.. చిత్ర వ‌ర్గాలు మాత్రం.. ''బ‌న్నీ ప‌క్క‌న నాజూకు అమ్మాయిలే బాగుంటారు. హ‌న్సిక బొద్దుగా ఉంది.. అందుకే ఆమె ప్లేసులో ర‌కుల్‌ని తీసుకొన్నాం'' అంటున్నాయి. మ‌రి ఈ రెండు వాద‌న‌ల్లో ఏది నిజ‌మో బ‌న్నీకే తెలియాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.