English | Telugu

అనుష్క‌కు అండ‌గా... మ‌హేష్ బాబు

బాహుబ‌లికి పోటీగా కాదుగానీ, ధీద‌టుగా మొదలైన చిత్రం `రుద్ర‌మ‌దేవి`. ఈ సినిమాపైనే గుణశేఖ‌ర్ త‌న ప్రాణాల‌న్నీ పెట్టుకొన్నాడు. అయితే బాహుబ‌లికి వ‌చ్చిన హైప్‌లో, మీడియా ఇచ్చిన ప్ర‌చారంలో రుద్ర‌మ‌దేవికి 10 శాతం కూడా ద‌క్క‌లేదు. అది చాల‌ద‌న్న‌ట్టు... విడుద‌ల‌కు ఎన్నో అడ్డంకులు. వీటి నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో గుణ‌శేఖ‌ర్‌కు అర్థం కావ‌డం లేదు. గుణ‌శేఖ‌ర్ ఇబ్బందుల‌న్ని తెలుసుకొన్న చిరు... ఈ సినిమాకి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి... కాస్త క్రేజ్ తెచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా ముందుకొచ్చాడు. `మీ సినిమాకి అండ‌గా ఉంటా... నా మ‌ద్ద‌తు ఇస్తా. కావాలంటే ప్ర‌మోష‌న్ల‌కు కూడా వ‌స్తా.` అని గుణ‌శేఖ‌ర్‌కు మాటిచ్చాడ‌ట మ‌హేష్‌. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఒక్క‌డు మ‌హేష్ కెరీర్‌కి బూస్ట‌ప్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర‌వాత అర్జున్‌, సైనికుడు చిత్రాలు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. అల్లు అర్జున్ పోషించిన గోన‌గ‌న్నారెడ్డి పాత్ర మ‌హేష్‌తో చేయించాల‌ని గుణ‌శేఖ‌ర్ కూడా భావించాడు. కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల అది వ‌ర్కువుట్ కాలేదు.

క‌నీసం ఈ సినిమాకి ఈ రూపంలో అయినా హెల్ప్ చేయాల‌ని మ‌హేష్ భావించాడు. దాంతో గుణ‌కు కొండంత ధైర్యం వ‌చ్చింది. ఇక మీద‌ట రుద్ర‌మ‌దేవి ప్ర‌చారంలో మ‌హేష్ క‌నిపించే అవ‌కాశం ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.