English | Telugu

అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్

ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ స్నేహారెడ్డితో మార్చ్ 5 వ తేదీన హైదరాబాద్ హైటెక్స్ లో ఘనంగా జరిగింది. అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ కి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై, అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులను ఆశీర్వదించారు. అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ ని ప్రముఖ శాటిలైట్ టి.వి.ఛానల్ "మా"టి.వి. లైవ్ టెలికాస్ట్ చేసింది. అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ ఏర్పాట్లన్నీ అంటే పెళ్ళి వేదిక సెట్ వేయటం దగ్గర్నుండీ అన్ని పనులూ అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ దగ్గరుండి పర్యవేక్షించాడు.

ఈ అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ కి చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, సూర్య, కార్తీక్, రానా, రామ్, మోహన్ బాబు, కె.రాఘవేంద్ర రావు, దాసరి నారాయణరావు, టి.సుబ్బిరామిరెడ్డి, మురళీ మోహన్, ఆలీ, సీనియర్ నటి శారద, క్రిష్, సంపత్ నంది, దిల్ రాజు, కీరవాణి, కోటి, కోడి రామకృష్ణ, శరత్ మరార్ (మా టి వి సి.ఇ.వొ.), జె.సి.దివాకర్ రెడ్డి,రాఘవులు, గుత్తా సుఖేందర్ రెడ్డి, జానారెడ్డి,బండారు దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, దేవేందర్ గౌడ్, అంబటి రాంబాబు, గట్టు రామచంద్రరావు, జయప్రకాష్ నారాయణ్ తదితరులు హాజరయ్యారు.

ఈ అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ "మా"టి.వి. లైవ్ టెలికాస్ట్ కారణంగా మీడియాకి ఫొటోలు తీసుకోటానికీ, వీడియో తీయటానికి అనుమతి లేదు. అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ పూర్తికాగానే తామే మీడియా వారందరికీ అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ ఫొటోలూ, వీడియో క్లిప్పింగులూ అందజేస్తామని అల్లు అరవింద్ తెలియజేశారు. అల్లు అర్జున్ మ్యారేజ్ ఫంక్షన్ పూర్తికాగానే " నా వివాహానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన అతిథులందరికీ నా ధన్యవాదాలు. అతిథులలో ఎవరికైనా ఏ విధమైన ఇబ్బంది కలిగినా అందుకు నన్ను మన్నించాల్సిందిగా కోరుతున్నాను" అని పెళ్ళి కొడుకు అల్లు అర్జున్ స్వయంగా మైక్ లో చెప్పటం ఆహూతులను ఆకట్టుకుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.