English | Telugu

'ఎన్టీఆర్'ని టెన్షన్ పెడుతున్న'అల్లు అర్జున్'

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తెగ టెన్షన్ పెడుతున్నాడట! లేటెస్ట్ గా అల్లు అర్జున్ రేసుగుర్రం మూవీ 50కోట్ల క్లబ్ లో చేరింది. విడుదలైన 25రోజులలో ఈ సినిమా 51కోట్లు వసూళ్ళు రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాతో అల్లు అర్జున్ 50కోట్ల మార్క్ ని దాటిన హీరోలలో నాలుగోవ స్థానంలో నిలిచాడు. ఈ రేసుగుర్రం దెబ్బకి జూనియర్ ఎన్టీఆర్ లో కలవరం మొదలైందట. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసిన ఎన్టీఆర్ ఆ తరువాత ఈ రేసులో మెల్లగా వెనుక పడిపోయాడు. అతని కంటే రేసులో వెనుక వచ్చిన హీరోలంతా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంటే యంగ్ టైగర్ మాత్రం ఇంతవరకు 50కోట్ల మార్క్ ని అందుకోలేకపోయాడు. దీంతో ఈ సారి ఇండస్ట్రీ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యాడట. దాని కోసం తనకి ఆ హిట్ ని ఇచ్చే దర్శకుడి వెతుకులాటలో జూనియర్ నిమగ్నమయ్యాడట. మరీ ఈసారైనా ఎన్టీఆర్ సక్సెస్ అవుతాడో లేదో చూద్దాం..!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.