English | Telugu

ఢిల్లీ భామతో రామ్ 'పండగ చేస్కో'

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టిన ఢిల్లీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ లో వరుసగా భారీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే గోపిచంద్, మంచు మనోజ్, నితిన్ సినిమా షూటింగ్ లతో బిజీగా గడుపుతున్న ఈ భామకి తాజాగా హీరో రామ్ 'పండగ చేస్కో' సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఎంపికైంది. మొదట ఈ చిత్రంలో హన్సిక ను హీరోయిన్ గా తీసుకోగా, ఆమెకి కాల్ షీట్ల ప్రాబ్లెం రావడంతో సినిమా నుంచి తప్పుకుంది. దీంతో రకుల్ ప్రీత్ కి ఈ అవకాశం దక్కింది. టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే వరుసగా భారీ ఆఫర్లు దక్కించుకుంటున్న రకుల్ ఈ సినిమాలతో తన టాలెంట్ నిరూపించుకుంటే త్వరలోనే టాప్ లీగ్ లో చేరడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.