English | Telugu

ఆ మూవీ చూసి సైలెంట్ అయిన అల్లు అర్జున్..అసలు కారణం ఆ నలుగురే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రెగ్యులర్ గా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకుడు అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాని విపరీతంగా ప్రేమించే అల్లు అర్జున్ కొత్తగా వచ్చే సినిమాలని కూడా చూసి ఆ మూవీ మీద ఉన్న తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్తాడు. బన్నీ తాజాగా యానిమల్ మూవీని చూసాడు. ఇప్పుడు ఆ మూవీ మీద బన్నీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

యానిమల్ మూవీ మీద బన్నీ తన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పాడు.హీరోగా చేసిన రణబీర్ కపూర్ ఇండియన్ సినిమా ఎక్సపీరియన్సు ని వేరే లెవల్ కి తీసుకెళ్లాడు. స్క్రీన్ మీద ఆయన చేసిన మ్యాజిక్ ని చూసి నాకు నోటమాట కూడా రావడం లేదు. అలాగే ఆయన నటన నాకు చాలా ఇన్స్పిరేషన్ గా నిలిచింది.అని చెప్పాడు. హీరోయిన్ గా చేసిన రష్మిక ఎంతో బ్రిలియంట్ గా నటించింది. అలాగే తను ఇంతవరకు చేసిన అన్ని సినిమాలకంటే యానిమల్ లోనే బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చింది. బాబీ డియోల్ గారి యాక్టింగ్ ని చూస్తున్నంత సేపు సైలెంట్ గా ఆయన్ని చూస్తూనే ఉన్నాను. ఆయన నటన రెస్పెక్ట్ ఇస్తు చాలా నేర్చుకున్నాను అని కూడా బన్నీ చెప్పాడు.

ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి ని అయితే బన్నీ ఆకాశానికి ఎత్తేసాడు.సందీప్ గారు మీరు సినిమాకి సంబంధించి ఉండే అన్ని పరిమితులని అధిగమించారు. యానిమల్ ని మీరు తెరకెక్కించిన విధానం టెర్రిఫిక్ గా ఉంది. భవిష్యత్తు లో మీరు భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మీ దర్శకత్వంతో మార్చబోతున్నారు అని చెప్పాడు.ఇలా బన్నీ పేరు పేరున ప్రశంసలు తెలపడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అలాగే సినిమాలో నటించిన ఇతర నటీనటులకి, టెక్నీషియన్స్ కూడా బన్నీ తన అభినందనలని తెలిపాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.