English | Telugu

వందకు పైగా థియేటర్లలో 'రఘువరన్ బి.టెక్' రీరిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్!

టాలీవుడ్ లో కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ రీరిలీజ్ ట్రెండ్ లో సత్తా చాటుతున్నాయి. ఇటీవల 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు 'రఘువరన్ బి.టెక్' కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ధనుష్ తమిళ చిత్రం 'వేలై ఇళ్ళ పట్టదారి'.. తెలుగులో 'రఘువరన్ బి.టెక్' పేరుతో 2015, జనవరి 1న విడుదలై తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 'స్రవంతి' రవికిశోర్ తెలుగులో విడుదల చేయగా.. యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఎనిమిదేళ్లకే ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను శుక్రవారం(ఆగస్టు 18న) రీరిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికేబుకింగ్స్ ఓపెన్ కాగా, మంచి స్పందన లభిస్తోంది.

'రఘువరన్ బీటెక్' రీ రిలీజ్ సందర్భంగా 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''కొన్ని సినిమాలను ఎవర్ గ్రీన్ మూవీస్ అంటుంటాం. అటువంటిచిత్రమే 'రఘువరన్ బి.టెక్'. ప్రతి తరంలోని విద్యార్థులకు కనెక్ట్ అయ్యే చిత్రమిది. స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్, కెరీర్ స్ట్రగుల్స్గురించి బాగా డిస్కస్ చేశారు. ప్రముఖ దర్శకుడు కిశోర్ తిరుమల తెలుగు డైలాగ్స్ రాశారు. డబ్బింగ్ డైలాగ్స్ తరహాలో కాకుండా ఆయన రాసిన మాటలన్నీఒరిజినల్ సినిమాకు రాసినట్టు రాశారు. ధనుష్ అయితే పాత్రలో జీవించారు. ఆయనలో చాలా మంది విద్యార్థులు తమనుతాము చూసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇప్పటికీ చూసుకుంటున్నారని అనిపిస్తోంది. ప్రజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన అనిరుధ్ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన సినిమాల్లో ఇదీ ఒకటి.ఎక్స్‌ట్రాడినరీ సాంగ్స్ అందించారు. రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. తెలుగులో అనిరుధ్ ఫస్ట్ హిట్ ఇది. ఈ సినిమా తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది'' అని అన్నారు.

ధనుష్ సరసన అమలాపాల్కథానాయికగా నటించిన ఈ సినిమాలో సురభి కీలక పాత్రధారి. వేల్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శరణ్య, సముద్రఖని, వివేక్, హృషికేష్, అమితాష్ప్రధాన్ ముఖ్య పాత్రలు పోషించారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.