English | Telugu

అలియాభట్ ఇంటికి కర్ణాటక వినాయకుడు..ప్రత్యేకతలు ఇవే  

భారతీయ చిత్రపరిశ్రమలో అలియాభట్(Alia Bhatt),రణబీర్ కపూర్(Ranbir Kapoor)జంటకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఇద్దరు తమ సినీకెరీర్ పీక్ లో కొనసాగుతున్నప్పుడే వివాహబంధంతో ఒక్కటయ్యారు. వివాహం అనంతరం కూడా అదే స్థాయిలో విజయాల్ని అందుకుంటు ముందుకు దూసుకుపోతున్నారు. 'రామాయణ'(Ramayana)తో రణబీర్ బిజీగా ఉండగా, అలియాభట్ 'ఆల్ఫా' అనే చిత్రంతో బిజీగా ఉంది. సదరు చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల కానుంది.

అలియాభట్ దంపతులు ఈ నెల 17 న ముంబై(Mumbai)లోని కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నారు. ఈ మేరకు ఇంట్లో గణపతి(Ganapathi)విగ్రహాన్ని ప్రతిష్టించడం కోసం కర్ణాటకలోని మైసూరుకి చెందిన ప్రఖ్యాత శిల్పకారుడు 'అరుణ్ యోగిరాజ్' కి కొన్నినెలల క్రితం ఆర్డర్ ఇచ్చారు. దీంతో అరుణ్ యోగిరాజ్(Arun Yogiraj)నల్లఏకశిలపై చెక్కిన అందమైన గణపతిని రూపొందించాడు. భక్తులని ఎంతగానో కట్టిపడేసేలా ఉన్న ఆ అందమైన గణనాధుడు నాలుగు అడుగుల ఎత్తులో ఉండగా, విగ్రహాన్ని చెక్కడానికి యోగిరాజ్ కి ఆరునెలల సమయం పట్టింది. రీసెంట్ గా గణనాధుడి విగ్రహం అలియాభట్ ఇంటికి చేరగా, యోగిరాజ్ కి ఎంత డబ్బులు చెల్లించారనే విషయం మాత్రం బయటకి రాలేదు.

అయోధ్య బాల రాముడ్ని(Ayodhya Balaramudu)కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించిన విషయం తెలిసిందే. సదరు బాల రాముడ్ని చూస్తు భక్తులందరు ఎంతగానో తన్మయత్వం చెందుతున్నారు.



టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .