English | Telugu

నందమూరి బాలకృష్ణ @  2 సంవత్సరాలు 

నందమూరి బాలకృష్ణ ఈ పేరు చెప్తే పులకరించిపోని తెలుగువాడు ఉండడు. తెలుగు సినిమా కథ యొక్క రూపురేఖల్లో ఎన్ని మార్పులు వచ్చినా సరే నేటికీ తెలుగు నేటివిటితో సినిమాలు తీసే హీరో బాలకృష్ణ. అలాగే బాలయ్యని రికార్డులకి రారాజుగా కూడా అయన అభిమానులు పిలుచుకుంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో బాలయ్య సృష్టించిన ఎన్నో రికార్డులు నేటికీ ఆయన పేరు మీద చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి సంబంధించిన ఒక తాజా వార్త టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

బాలకృష్ణ ద్విపాత్రాభినయం పోషించిన చిత్రం అఖండ. ఈ చిత్రం 2021 డిసెంబర్ 2 న విడుదల అయ్యింది. అంటే నేటికీ అఖండ వచ్చి సరిగ్గా రెండు సంవత్సరాలు అవుతుంది. కరోనా కొంచం తగ్గుముఖం పట్టిన తర్వాత అసలు జనాలు సినిమా లకి వస్తారా రారా అనే డౌట్ లో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తెలుగు సినిమా 20 రోజులకి 30 రోజులకి మాత్రమే పరిమితమైన వేళ అఖండ 103 సెంటర్స్ లో 50 రోజులు జరుపుకొని టోటల్ రన్ లో 130 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. ఆదోని ,ఎమ్మిగనూరు ,చిలకలూరి పేట ,కోయిల కుంట్ల లాంటి కేంద్రాల్లో శతదినోత్సవాన్ని కూడా జరుపుకుంది.

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ మూవీ అంతటి ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం బాలయ్య పండించిన పెరఫార్మెన్సె అని ప్రతి ఒక్కరు ఒప్పుకునే నిజం. అఘోరాగా, ప్రజల మంచి కోరుకునే సోషల్ వర్కర్ గా ఇలా రెండు కేరక్టర్స్ లో బాలయ్య నటన నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఉంటుంది. మరి ముఖ్యంగా అఘోరా క్యారక్టర్ లో బాలయ్య నటనకి డైలాగ్స్ కి ప్రేక్షకులు మొత్తం పూనకాలు వచ్చిన వాళ్ళల్లా ఊగిపోయారు.ఆయన నోటి వెంట వచ్చిన ఒక్కో డైలాగ్ ఒక అణుబాంబు లాగా పేలింది. ఇంకో ఇరవై సంవత్సరాలు వచ్చిన సరే అఖండ మూవీ ప్రేక్షకుల గుండెల్లో చెక్కు చెదరకుండా ఉండిపోతుందనేది వాస్తవం.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.