English | Telugu

ఆగిపోయిన సినిమా మొదలైంది.. ఇరకాటంలో అజిత్!

కోలీవుడ్‌ హీరోలలో అజిత్‌కి సక్సెస్‌ రేట్‌ ఎక్కువనే చెప్పాలి. ఈమధ్యకాలంలో వరస విజయాలతో దూసుకెళుతున్న అజిత్‌ తన కొత్త సినిమా ‘విడాముయర్చి’ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. మగిల్‌ తిరుమనేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అజర్‌బైజాన్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా ఈ సినిమా అసిస్టెంట్‌ కెమెరామెన్‌ మృతి చెందడంతో షూటింగ్‌ని అప్పటికప్పుడు నిలిపివేశారు. ఆరోజు నుంచి ఈ సినిమా షూటింగ్‌ను కొంతకాలం పాటు చేయలేదు. దాంతో ఈ సినిమాను పక్కన పెట్టారన్న వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది చిత్ర యూనిట్‌. షూటింగ్‌ ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచే మళ్లీ షూట్‌ మొదలుపెట్టారు. ఇటీవల అజిత్‌ చెన్నై ఎయిర్‌ పోర్టులో కనిపించడంతో అజర్‌ బైజాన్‌ షూటింగ్‌ కోసం అతను బయలుదేరినట్టు తెలుస్తోంది. యూనిట్‌ సభ్యులు ఇప్పటికే స్పాట్‌లో ఉన్నారు. షూటింగ్‌ కూడా మొదలు పెట్టినట్టు సమాచారం. అజర్‌ బైజాన్‌ షెడ్యూల్‌ టోటల్‌గా పూర్తి చేసాక చెన్నైలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించడానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాని విడుదల చెయ్యాలన్నది వారి ప్లాన్‌. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ బాగా ఆలస్యమైంది. దీంతో ఇకపై నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చెయ్యాలని యూనిట్‌ భావిస్తోంది.

ఈ సినిమా ఆలస్యం కావడం వల్ల అజిత్‌కు కొన్ని సమస్యలు ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కేటాయించిన డేట్స్‌ ప్రకారం షూటింగ్‌ చేయకపోవడం వల్ల అదనంగా డేట్స్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిరది. దీంతో అతని తదుపరి సినిమాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా తర్వాత అజిత్‌ చేసే సినిమాకి సంబంధించిన స్టోరీ డిస్కషన్‌ కూడా పూర్తయింది. త్వరలోనే షూటింగ్‌ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నార. ఇప్పుడు విడాముయర్చి షూటింగ్‌ ఆలస్యం కావడం వల్ల అతని తదుపరి సినిమా కూడా లేట్‌గానే స్టార్ట్‌ అవుతుందని తెలుస్తోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.