English | Telugu

ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ రిలీజ్..పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో అదుర్స్ కూడా ఒకటి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ నవంబర్ 18 న ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ కి సిద్దమవుతుంది. అదుర్స్ మూవీ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసేలా అదుర్స్ మూవీ నుంచి వచ్చిన ఒక తాజా అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఎన్నో సినిమాల్లో అదుర్స్ కూడా ఒకటి. ఈ మూవీలో నరసింహ అనే మాస్ క్యారెక్టర్లో చారి అనే ఒక క్లాస్ బ్రాహ్మణ క్యారెక్టర్లో ఎన్టీఆర్ వీరవిహారం చేసాడు. తాజాగా అదుర్స్ రీ రిలీజ్ కి సంబందించిన ట్రైలర్ విడుదల అయ్యింది.ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వస్తున్న కొత్త సినిమా ట్రైలర్ ని చూస్తున్నట్టుగా ఫ్రెష్ గా చాలా బాగుందని అంటున్నారు.

ఎన్టీఆర్ కామెడీ ని కూడా ఇరగదీయగలడు అని నిరూపించిన ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నయనతార ,షీలా హీరోయిన్లుగా నటించగా బ్రహ్మానందం , నాజర్, తనికెళ్ళ భరణి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, ఆశిష్ విద్యార్థి, మహేష్ మంజ్రేకర్ ,ఎంఎస్ నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో వచ్చిన సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.