English | Telugu

'దేవర' ఎపిక్ షెడ్యూల్.. 'నాటు నాటు'ని మించేలా 2000 మందితో భారీ సాంగ్!

పెద్దగా బ్రేక్ లు లేకుండా శరవేగంగా షూటింగ్ జరుగుపుకుంటున్న బడా చిత్రాలలో 'దేవర' ముందు వరుసలో ఉంటుంది. 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రమిది. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది. జనవరి కల్లా షూటింగ్ పూర్తయ్యేలా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మూవీ టీం దూసుకెళ్తోంది. అయితే షూటింగ్ కి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది.

'దేవర' టీం ఇటీవల గోవా షెడ్యూల్ పూర్తి చేసుకొని, దీపావళికి చిన్న బ్రేక్ తీసుకున్నారు. అయితే పండగ సందడి అలా ముగిసిందో లేదో అప్పుడే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం వెల్లడించింది. "చిన్న పండగా బ్రేక్ తర్వాత, మా టీం ఎపిక్ షెడ్యూల్ కోసం మళ్ళీ సెట్స్ మీదకు వచ్చింది" అని తెలిపింది

మంగళవారం నుంచి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన విలేజ్ సెట్ లో దేవర కొత్త షెడ్యూల్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే శంషాబాద్ దగ్గర కూడా కొంత భాగం షూట్ చేయనున్నారని సమాచారం. ఇక ఈ షెడ్యూల్ లోనే ఓ భారీ సాంగ్ చిత్రీకరణ కూడా ఉంటుందట.

ఎన్టీఆర్ లాంటి బడా మాస్ హీరోకి అనిరుధ్ మాస్ బీట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. అందుకే 'దేవర'కు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అని తెలియగానే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అనిరుధ్ ఓ అదిరిపోయే మాస్ నెంబర్ ని స్వరపరిచాడట. ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేసేలా సాగే ఈ పాట గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. అందుకే ఈ సాంగ్ ని భారీగా తెరకెక్కించాలని భావించిన కొరటాల.. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ని రంగంలోకి దింపాడట. దాదాపు రెండు వేల మందితో ఎన్టీఆర్ పాత్రని ఎలివేట్ చేసేలా చిత్రీకరించే ఈ పాట.. థియేటర్లలో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు.

ఎన్టీఆర్ - ప్రేమ్ రక్షిత్ ది హిట్ కాంబో. ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ', 'కంత్రి', 'అదుర్స్', 'ఆర్ఆర్ఆర్' వంటి సినిమాలలో సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ చేసి ప్రేమ్ రక్షిత్ పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు' పాట గ్లోబల్ లెవెల్ లో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు దేవరతో వీరి కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.