English | Telugu

పరిచయంలేకపోయినా పెళ్ళికి వచ్చిన పవన్!

హోమ్లీ ఇమేజ్‌తో హీరోయిన్‌గా తనకు వచ్చిన వ‌రుస అవకాశాలను సొంతం చేసుకొని మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకుంది లయ. స్వయంవరంతో తెలుగులోకి హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆమెకి ప్రేమించు మిస్సమ్మ వంటి మంచి హిట్స్ ఉన్నాయి. అలాగే బాలకృష్ణ స‌ర‌స‌న కూడా నటించింది. 2006లో అమెరికన్ డాక్టర్ గణేష్‌ను వివాహం చేసుకున్నాక లయ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఆ మధ్య అమ‌ర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో హీరోయిన్‌కి తల్లిగా చిన్న పాత్రలో నటించింది లయ. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘పవన్ కళ్యాణ్ గారు నా పెళ్ళికి రావడం జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం. నేను పవన్ కళ్యాణ్ గారితో ఏ సినిమాలో నటించకపోయినా నా పెళ్లికి ఆహ్వానిస్తే వచ్చారు.

పెళ్ళికి ఆహ్వానించేందుకు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లాను. అప్పుడు నాకు అపాయింట్మెంట్ లేకపోయినా ఆయన నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు. చాలాసేపు మాట్లాడారు. పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించాను. తప్పకుండా వస్తాను అన్నారు. అయితే నేను ఊరికినే అన్నారు అనుకున్నా. కానీ నా పెళ్ళికి వచ్చారు. ఎటువంటి హంగామా సమాచారం లేకుండా రావడంతో పవన్ కళ్యాన్ కు మర్యాదలు చేయలేకపోయాను.

చిరంజీవి గారు కూడా నా పెళ్ళికి వచ్చారు. చిరంజీవి గారితో నాకు పరిచయం ఉంది. ఇండస్ట్రీ పెద్దగా ఆయన వచ్చారు. కానీ పరిచయం లేకుండా పవన్ కళ్యాణ్ గారు రావడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం’ అని లయ పేర్కొంది. అలాగే తన ఫ్యామిలీ గురించి చెబుతూ... నా కూతుర్ని హీరోయిన్‌గా చూడాలని ఆశ ఉంది. అయినా అవకాశాల కోసం ఎవరిని అడగను. అలాగే తనను కూడా హీరోయిన్ అవ్వమని బలవంతం చేయను అని చెప్పింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.