English | Telugu

కల్పికా గణేష్‌తో ఎఫైర్‌.. రియాక్ట్‌ అయిన అభినవ్‌ గోమటం

నేటితరం టాలీవుడ్‌ కమెడియన్స్‌తో అభినవ్‌ గోమటంకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. అతనిపై నటి కల్పికా గణేష్‌ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనతో అసభ్యంగా మాట్లాడాడని, తప్పుగా ప్రవర్తించాడని ఆరోపించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత అక్క పాత్రలో నటించిన కల్పికా గణేష్‌ ఊహించని విధంగా అభినవ్‌ గోమటంపై చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఈ విషయం పోలీసుల ఎంట్రీ ఇచ్చే వరకు వెళ్లింది. అయితే అప్పట్లో కల్పిక చేసిన ఆరోపణలపై అభినవ్‌ స్పందించలేదు. కానీ, రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తనపై కల్పిక చేసిన కామెంట్స్‌పై రియాక్ట్‌ అయ్యాడు.

‘కల్పికతో నాకు పెద్దగా పరిచయం లేదు. అరు నెలలకో, ఏడాదికో ఓసారి ఆమెతో చాట్‌ చేసేవాడిని. గత ఏడాది నవంబర్‌లో తనకు నారీ శక్తి అవార్డ్‌ వచ్చినట్లు కల్పికా గణేష్‌ నాకు మెసేజ్‌ పెట్టింది. ఆ అవార్డ్‌ గురించి నేను ఎప్పుడూ వినలేదు. కానీ, నీకు ఆ అవార్డ్‌ రావటం ఎంతో ఆనందంగా ఉంది అంటూ అభినందనలు తెలిపాను. నేను ఓ ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని అనుకుంటూ బదులిచ్చాను. కానీ, ఆ అవార్డ్‌ గురించి నువ్వు వినలేదా? అంటూ ఆమె గొడవకు దిగింది. పురుషాహంకారిని అని అంది. అంతే కాకుండా నీకు అంత చులకనా? నీకు ఇగో అంటూ అగ్లీ ఫైట్‌ చేసింది. దాంతో నేను ఆమె మెసేజ్‌లకు రిప్లై ఇవ్వటం మానేశాను. తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను పరిశీలిస్తే అందరితోనూ ఆమె అలాగే గొడవపడుతుంది.

అవార్డు గురించి తెలియదని చెప్పిన దానికి ఆ చాట్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఆ అవార్డ్‌ గురించి తెలియదని చెప్పినందుకు నేను చచ్చిపోవాలంటూ మెసేజ్‌లు కూడా పెట్టింది. అయితే అవార్డ్‌ తెలియదని చెప్పటంలో తప్పేముందని చాలా మంది నెటిజన్స్‌ ఆమెకు రిప్లయ్‌ ఇచ్చారు. మా మధ్య జరిగిందిదే. లవ్వు గివ్వు లేదు. నేను ప్రేమ కావ్యాలేం రాయలేదు’ అంటూ కల్పిక చేసిన ఆరోపణలకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు అభినవ్‌.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.