English | Telugu

‘అభిలాష’తో జూన్ 2 న అందరిముందుకు అమరదీప్

బుల్లితెర మీద క్లిక్ ఐన ఆర్టిస్ట్స్, కమెడియన్స్ చాలామంది సిల్వర్ స్క్రీన్ మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాంటి ఒక బుల్లితెర నటుడు అమరదీప్ చౌదరి. "జానకి కలగనలేదు" సీరియల్ లో రామాగా నటిస్తూ తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. అదే బుల్లితెర మీదే నటించే తేజస్విని గౌడను రీసెంట్ గా ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అమరదీప్ సిల్వర్ స్క్రీన్ మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. "అభిలాష" అనే నా ఫస్ట్ మూవీతో జూన్ 2 న వస్తున్నాను" అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. అమర్‌దీప్‌ హీరోగా, అశ్విని రెడ్డి హీరోయిన్‌గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు.

అమరదీప్ ఇంతకు ముందు 'ఐరావతం' అనే మూవీలో నటించాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో రిలీజ్ ఐన ఈ మూవీ మంచి వ్యూస్ ని అందుకుంది. 2016 లో షార్ట్ ఫిలింతో తన కెరీర్ ని స్టార్ట్ చేసిన అమర్ " సూపర్ మచ్చి, రాజధాని లవ్ స్టోరీ" సహా కొన్ని వెబ్ సిరీస్ లో నటించాడు. "ఉయ్యాల జంపాల, సిరిసిరిమువ్వలు" సీరియల్స్ లలో కూడా నటించాడు. అంతేకాదు వెండితెర మీద కొన్ని మూవీస్ లో కూడా సైడ్ ఆర్టిస్టుగా యాక్ట్ చేసాడు. ఇక త్వరలో రాబోతున్న "అభిలాష" మూవీ మెసేజ్ ఓరియెంటెడ్ గా రాబోతోంది. అదే చదువు వద్దన్న విలన్ కి హీరో ఎలా బుద్ది చెప్పాడు అనేదే స్టోరీ. ఈ మూవీ పోస్టర్ తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసేసరికి అమరదీప్ ఫాన్స్, నెటిజన్స్ అంతా విషెస్ చెప్తున్నారు. సీరియల్స్ లో మొదట్లో 25 వేలు పారితోషికం తీసుకున్న అమరదీప్ ఇప్పుడు 90 పైన తీసుకుంటున్నాడట. అలాగే మూవీస్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నట్లు చెప్పాడు. మరి ఈ మూవీలో అమరదీప్ నటన ఏ మేరకు రక్తి కట్టించాడు అనే విషయం తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.