English | Telugu

‘శంబాల’ చిత్రానికి పాజిటివ్‌ టాక్‌.. సక్సెస్‌ ట్రాక్‌లోకి వచ్చేసిన ఆది!

సీనియర్‌ నటుడు సాయికుమార్‌ నట వారసుడిగా ‘ప్రేమకావాలి’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు ఆది సాయికుమార్‌. తొలి సినిమాతోనే హీరోగా మంచి పేరు తెచ్చుకొని యూత్‌లో ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. ఆ తర్వాత చేసిన ‘లవ్‌లీ’ చిత్రం కూడా మంచి హిట్‌గా నిలిచింది. 2013లో ఆది హీరోగా వచ్చిన ‘సుకుమారుడు’ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అప్పటి నుంచి ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘షణ్ముక’ వరకు దాదాపు 20 సినిమాల్లో హీరోగా విభిన్నమైన పాత్రలు పోషించారు. వాటిలో ఒకటి, రెండు తప్ప ఆది కెరీర్‌ గ్రాఫ్‌ పెరిగేందుకు ఉపయోగపడలేదు. అయితే అతనికి ప్రతి సినిమాలోనూ నటుడిగా మంచి పేరు వచ్చింది.

అందం, అభినయం ఉంటూనే ఒక కమర్షియల్‌ హీరోకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కలిగిన తన కుమారుడు సక్సెస్‌ఫుల్‌ హీరోగా తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకోవాలని సాయికుమార్‌ తపనపడ్డారు. ఒక సాలిడ్‌ హిట్‌ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి హిట్‌ సినిమా.. తాజాగా విడుదలైన ‘శంబాల’ రూపంలో వచ్చింది. డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా విడుదలైన ఈ సినిమాకి యునానిమస్‌గా పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ఆది హిట్‌ ట్రాక్‌లోకి వచ్చినట్టేనని రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. పురాణాలను లింక్‌ చేస్తూ ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో విక్రమ్‌ అనే సైంటిస్ట్‌ పాత్రను ఆది సమర్థవంతంగా పోషించారని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. దీన్నిబట్టి ఆది కెరీర్‌కి ఇక ఢోకా ఉండదనేది అర్థమవుతోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.