English | Telugu

కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడు!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం 'విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ'. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం పరవాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ఎనిమిది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా కిరణ్ కి మంచి విజయాన్ని అందించింది. మొదటి రెండు చిత్రాలు 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కల్యాణమండపం'తో ఆకట్టుకున్న కిరణ్ ఆ తరువాత వరుసగా మూడు చిత్రాలతో నిరాశపరిచాడు. ఈ క్రమంలో 'విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ' రూపంలో అతనికి మంచి విజయం వరించింది.

రూ.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ' ఎనిమిది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.4.25 కోట్ల షేర్ రాబట్టగా.. వరల్డ్ వైడ్ గా రూ.4.75 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల అంచనా. ఫుల్ రన్ లో మరో కోటికి పైగా షేర్ సాధించి.. మొత్తానికి రూ.6 కోట్ల షేర్ వసూలు చేసే అవకాశముంది. ఈ చిత్రం భారీ విజయం సాధించే అవకాశం లేనప్పటికీ.. సరైన సమయంలో కిరణ్ కి మంచి విజయం దక్కిందని చెప్పవచ్చు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.