English | Telugu

క‌ర్చీఫ్ నెం.1.... దిల్‌రాజు

టాలీవుడ్‌లో కొత్త టాలెంట్ క‌నీక‌నిపించ‌గానే అమాంతం ఒడిసిప‌ట్టేయ‌డంలో దిట్ట‌... దిల్‌రాజు. కొత్త ద‌ర్శ‌కుడెవ‌రైనా హిట్టు కొడితే.. అమాంతంగా క‌ర్చీఫ్ వేసేస్తారు. కొత్త క‌థానాయిక మెరిస్తే... అడ్వాన్సులు ఇచ్చేస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. ఈ శుక్ర‌వారం విడుద‌లై హిట్ కొట్టిన చిత్రం సినిమా చూపిస్త మావ‌. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సింపుల్ స్టోరీలైన్‌ని ఆయ‌న డీల్ చేసిన విధానం అంద‌రికీ న‌చ్చింది. చిన్న బ‌డ్జెట్‌లో క్వాలిటీ ఉన్న సినిమా తీశారాయ‌న‌.

ఈసినిమా విడుద‌ల‌కు ఉందే లాభాల‌ను తెచ్చుకొంది. సినిమా చూపిస్త మావ‌ని నైజాంలో పంపిణీ చేసిన దిల్‌రాజు.. ఇప్పుడు త్రినాథ‌రావుకి అడ్వాన్సులు ఇచ్చారు. త్రినాథ‌రావు త‌దుప‌రి సినిమా దిల్‌రాజు బ్యాన‌ర్‌లోనే అని తెలుస్తోంది. 'నీకు కావ‌ల్సిన టీమ్ ఇస్తా.. సినిమా చేసిపెట్టు' అని బ్లాంక్ చెక్ చేతిలో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. అలా... క‌ర్చీఫ్ వేయ‌డంలో టాలీవుడ్‌లో త‌న‌కంటే మొన‌గాడు లేడ‌న్న విష‌యాన్ని మ‌రోసారి నిరూపించుకొన్నారీయ‌న‌.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.