English | Telugu

వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో మళ్ళీ రిమాసేన్

వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో మళ్ళీ రిమాసేన్ హీరోయిన్ గా నటించబోతోందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే గతంలో సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై, ఉదయ్ కిరణ్ హీరోగా, రీమాసేన్ హీరోయిన్ గా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో, సుమారు ఓ పదేళ్ళ క్రితం యమ్.యస్.రాజు నిర్మించిన "మనసంతా నువ్వే" చిత్రం సూపర్ హిట్టయ్యింది. ఆ చిత్రం దర్శకుడిగా వి.యన్.ఆదిత్యకు ఇదే తొలిచిత్రం కావటం విశేషం.ఆ చిత్రం తర్వాత మళ్ళీ రీమాసేన్ ఇప్పుడొక చిత్రంలో వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో నటించబోతూందని తెలిసింది.

ఈ చిత్రాన్ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించబోతూందని సమాచారం. ఈ చిత్రంలో ఒక ప్రముఖ హీరో నటిస్తారని కూడా ఫిలిం నగర్ వర్గాగాలంటున్నారు. ఈ చిత్రం షుటింగ్ "మే" నేలలో మలేసియాలో షుటింగ్ జరుపుకోనుందని తెలిసింది. జూన్ నుంచి ఈ చిత్రం షుటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతుందని తెలిసింది. దర్శకుడు వి.యన్. ఆదిత్య ఇటీవల సుమంత్ హీరోగా నటించిన "రాజ్" చిత్రానికి దర్శకత్వం వహించారు. దానికన్నా ముందు "చుక్కలాంటి అమ్మాయి- చక్కనైన అబ్బాయి" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. కానీ అవి ఒక దర్శకుడిగా ఆయనకు పెద్దగా ఉపయోగపడలేదు. అందుకని ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనైనా సూపర్ హిట్టయ్యే విధంగా దర్శకులు వి.యన్.ఆదిత్య తగు జాగ్రత్తలలు తీసుకున్నారని తెలిసింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.