English | Telugu

నిర్మాతల మండలి ఆవేదన

నిర్మాతల మండలి ఆవేదన చెందింది. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర నిర్మాతల మండలి(ఎ.పి.ప్రొడ్యూసర్స్ కౌన్సిల్)వారు ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో గత వారం రోజులుగా ఎ.పి.ఫిలిం ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె కారణంగా నిర్మాతలు ఆర్థికంగా ఎంత నష్టపోతున్నారో, తరువాత సినిమా తీయటానికి వారికి కళాకారుల డేట్లు దొరక్క ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారో మీడియాకు తెలియజేశారు. వారు ఇంకా మాట్లాడుతూ ప్రభుత్వ లేబర్ యాక్ట్ కన్నా, చెన్నై, కర్ణాటక, ముంబై కన్నా తెలుగు సినీ పరిశ్రమలోనే సినీ కార్మికులకు ఎక్కువ జీతాలిస్తున్నామనీ, ప్రస్తుతం వారు చేస్తున్న సమ్మెకు 32 శాతం వారి జీతాలను పెంచామనీ, అందుకు 17 క్రాఫ్టులు అంగీకారం తెలిపినా, కొందరు నాయకుల సంకుచిత,దురాశాపూరిత ధోరణుల మూలంగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉండిందని వారన్నారు.


నిర్మాతలు ఇంకా మాట్లాడుతూ వారు సమ్మె విరమించి సినీ నిర్మాణాలకు సహకరిస్తే బాగుంటుందనీ, లేకుంటే తాము ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి లేబర్ యాక్ట్ కన్నా ఎంత ఎక్కువ ఇస్తున్నామో తెలియజేసి,వీరు రాకపోతే తమకు నచ్చిన వారితో తమ సినిమాలను నిర్మించుకుంటామనీ అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో నిర్మాతలు దగ్గుబాటి సురేష్, స్రవంతి రవికిశోర్, ప్రసన్న కుమార్, దిల్ రాజు, దమ్మాలపాటి శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.